మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్‌లో మరో సెలబ్రిటీ కనిపించబోతున్నారు..! సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో సాహసాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ రియల్ లైఫ్‌లో అడవిలో అడ్వైంచర్స్ చేయబోతున్నారు. బియర్ గ్రిల్స్‌తో కలిసి బందిపుర అభయారణ్యంలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు రజనీకాంత్. 

 

డిస్కవరీ ఛానల్ కోసం ఉత్తరాఖండ్ అడవుల్లో ప్రధానమంత్రి మోడీ చేసిన సాహస యాత్ర ఇది. బ్రిటిష్ సాహసికుడు బియర్ గ్రిల్స్‌తో ఉత్తరాఖండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతం జిమ్ కోర్‌బెట్ పార్క్‌లో మోడీ సాహస విన్యాసాలు చేశారు.  

 

మ్యాన్ వర్సెస్ వైల్డ్ కోసం అప్పుడు ప్రధానమంత్రి మోడీతో ప్రోగ్రామ్ చేసిన డిస్కవరీ ఛానల్...ఈ సారి మరో సెలబ్రిటీని చూపించబోతోంది. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్  కార్యక్రమంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. మోడీ ప్రోగ్రామ్ కోసం ఉత్తరాఖండ్‌ను ఎంచుకున్న డిస్కవరీ చానల్ ఈసారి దక్షిణ భారత దేశంలోనే షూటింగ్ పూర్తి చేస్తోంది. కర్ణాటకలోని బందిపుర అడవుల్లో షూటింగ్ సాహసయాత్ర మొదలైంది.  

 

మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ కోసం బందిపుర అడవులకు చేరుకున్న రజనీకాంత్ మూడు రోజులు అక్కడే బస చేయబోతున్నారు. బందిపుర అటవీ ప్రాంతంలో పులల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బందిపురలో నాలుగు ప్రాంతాల్లో షూటింగ్‌కు అనుమతిచ్చింది. ప్రక్రియ పరిరక్షణతో పాటు వణ్యప్రాణుల రక్షణ రజనీకాంత్‌తో మాట్లాడతారు బ్రియర్ గ్రిల్స్.

 

రజనీకాంత్ సహజంగానే కొండలు, కోనలు, అటవులు , గుట్టల్లో ప్రయాణాలంటే ఇష్టపడతారు. ఒంటరిగా హిమాలయాలకు కూడా వెళ్లి వస్తూ ఉంటారు. అలాంటిది ఈసారి మూడు రోజుల పాటు పూర్తిగా బందిపుర అడవుల్లో గడుపుతున్నారు రజనీకాంత్.మొత్తానికి రజినీకాంత్ అడవుల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించడంపై ఆయన అభిమానులు చాలా గ్రేట్ గా ఫీలవుతున్నారు. తమ అభిమాన నటుడు ఈ అడ్వెంచర్ లో విజయం సాధించి క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: