దేశానికి యువతే వెన్నెముక అంటారు. కొంతమంది యువత మంచిదారిలో వెళ్తూ అద్భుత ఆవిష్కరణలతో సత్తా చాటుతుంటే.. మరికొందరు చెడుదారిని ఎంచుకుని భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.  హత్యలు, చోరీలు, దోపిడీలకు పాల్ప డుతూ నేరస్తులుగా మారుతున్నారు. జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న వారు కొందరైతే.. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే త‌ప్పుడు మార్గాలు ఎంచుకునేవారు కొంద‌రు. ఇదిలా ఉంటే.. ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు.. రోజూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది..అయితే, అవసరాలకు కావాల్సిన డబ్బు కోసం ఆ ఇద్దరూ జంటగా మోసాలు చేయటం అలవర్చుకున్నారు.

 

ఇలా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుండి బాగానే దోచేసుకుంటున్నారు ఈ కిలాడీ ల‌వ‌ర్స్‌. అయితే చివ‌ర‌కు బాధితుల ఫిర్యాదుతో ఇద్దరూ కటకటా పాలయ్యారు. మేడిపల్లిలో నివసించే భాను ప్రకాష్ జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ఇక అదే ప్రాంతానికి చెందిన మానస అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరు డబ్బు కోసం అడ్డదారులు ఎంచుకున్నారు.  ఇలా సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశలో దొంగతనాలకు అలవాటు పడ్డారు. పెప్పర్ స్ప్రే సహాయంతో దోపిడీలు చేయాలని ప్లాన్ చేశారు.

 

ఈ క్ర‌మంలోనే ఇద్దరూ పెప్పర్ స్ప్రేలు కొనుగోలు చేసి.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని స్పే జల్లి దొంగతనాలకు పాల్పడేవారు. ఇలా ఈ ల‌వ‌ర్స్ కాస్తా ఖ‌త‌ర్నాక్స్‌గా మారి కూకట్‌పల్లి, వనస్థలిపురం, ఘట్‌కేసర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే మేడిపల్లి ప్రాంతంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజీలో కిలాడీ ప్రేమికుల విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. దీంతో పోలీసులు మాటు వేసి వాళ్ల‌ను ప‌ట్టేసారు. ఇక ప్ర‌స్తుతం వాళ్ల‌ను  వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: