కొంత మందికి ఉండే దేశ భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక జవాన్లు అంటే వాళ్లకు ప్రాణం కూడా. సోషల్ మీడియాలో హడావుడి చేసే వాళ్ళు కొందరు అయితే నిజ జీవితంలో సైనికులను ఆదుకునే వాళ్ళు మరికొందరు ఉంటారు. ఈ విషయం అందరికి తెలిసిందే.

 

చాలా మంది సైనికుల కోసం సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా అమర జవాన్ల పిల్లలను కూడా చదివిస్తూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి ఏకంగా అమరజవాన్ల కోసం ఒక పని చేసాడు. ఆ పని ఏంటీ అంటే... తన వీపు మీద 173 మంది అమర జవాన్ల పేర్లను పచ్చబొట్టుగా పోడిపించుకున్నాడు.

 

పుల్వామా ఉగ్రదాడి, కార్గిల్ యుద్ధం, అనంతనాగ్, సహా పలు దాడులలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను తన వీపుపై పచ్చబొట్టుతో రాయి౦చుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

 

విజయ్ హిందుస్తానీ అనే ఒక దేశభక్తుడు ఈ విధంగా చేసాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో అతని దేశభక్తిని పలువురు అభినందిస్తున్నారు.

 

అలాగే ఛాతీ మీద we support caa, NRC అని వేయించుకోవడం విశేషం. కాగా గత ఏడాది ఫిబ్రవరి 14 న పుల్వామా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగి నేటికి ఏడాది అవుతుంది. దీనితో దేశవ్యాప్తంగా కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: