తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ ప్రారంభమైంది. పరీక్షలు అనగానే చాలామంది విద్యార్థులు టెన్షన్ పడుతూ ఉంటారు. కొన్ని తప్పులు చేయడం వల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. పరీక్షల్లో కొంత మందికి అన్ని ప్రశ్నలకు జవాబులు తెలిసినా సమయం సరిపోదు. చేతివ్రాతలో వేగం పెంచుకొని ఈ సమస్య అధిగమించవచ్చు. 
 
ఇతరులతో పోల్చుకొని పరీక్షలకు ప్రిపేర్ కాకూడదు. ప్రతి ఒక్కరికి కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. విద్యార్థులు తమ సొంత సామర్థ్యాలతో, పాజిటివ్ ఆలోచనలతో పరీక్షలకు సిద్ధమైతే మంచి మార్కులు పొందవచ్చు. పరీక్షకు ముందురోజు విద్యార్థులు కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి. పరీక్షకు ముందు కాఫీ, టీలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులు ఫలితం కంటే ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మంచిది. 
 
పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ వల్ల మనస్సుకు విశ్రాంతి కలిగి ప్రశాంతత చేకూరుతుంది. చదివేటప్పుడు హార్డ్ సబ్జెక్ట్ తరువాత ఈజీ సబ్జెక్టులను చదవాలి. ముఖ్యమైన అంశాలను బిగ్గరగా చదవాలి. అలా చేస్తే చదివిన సబ్జెక్ట్ బాగా గుర్తుండిపోతుంది. పరీక్షకు కొన్ని గంటల ముందు సిలబస్ ను సమర్ధవంతంగా పూర్తి చేయడానికి సరైన పద్ధతులు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ టిప్స్ పాటిస్తే పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: