ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువయిపోయాయి. వాటివల్ల కొన్ని జీవితాలు నాశనం అయపోతున్నాయి. నాశనం అయిపోతున్నాయి. పిల్లలు భార్య భర్త ఇలాంటి బంధాలు అనుబంధాలకి విలువలు లేకుండా పోతున్నాయి. కేవలం ఐదు నిముషాల సుఖం కోసం ఎలాంటి పనులు చెయ్యడానికైనా వెనకాడటం లేదు. ఒకప్పుడు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దాంతో పెద్దవాళ్ళంటే భయం భక్తి ఉండేది ఇప్పుడు విడిగా కాపురాలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించడానికి సంసారం బాధ్యతలు..పెళ్ళి భర్త అనే గౌరవాలు లేకుండా పోయాయి. మరి ఇలాంటి దారుణ ఘటన ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది.
ఓ యువకుడిని రోకలిబండతోకొట్టిమరీ చంపేసిన ఘటన కలకలం రేపింది. పట్టాభిపురం భాగ్యనగర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ హత్య వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నగరానికి చెందిన షేక్ నాగకుమార్ అనే యువకుడి తలపై రోకలిబండతో విచక్షణారహితంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపడిపోయాడు.
కేవలం అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో మంగరాజు, పుల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు నాగకుమార్ పై దాడి చేసి హతమార్చారు. ఇంతటి దారుణ సంఘటన గుంటూరులో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికుల సమాచారం ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరులో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత పట్టాభిపురం పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని మాత్రం పోలీసులకు ఒక ఛాలెంజింగ్ కేస్ లాగా తయారయింది.