1 . మనిషి ఈ భూమ్మీద తానొక్కడినే మగాడిని అనుకొన్నాడు. నాకు ఎదురు లేదు అనుకొన్నాడు. ఏ జీవి గురించి ప్రకృతి గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రకృతిలో వున్నాము అన్న విషయాన్నీ దాదాపుగా మర్చిపోయాడు. పులిని చంపాడు , అంత పెద్ద ఏనుగును భయపెట్టాడు. దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంచు మించుగా అడవిని ఖాళీ చేశాడు ప్రకృతిని విద్వంసము చేసాడు. భూమి మీద గీతలు గేసాడు. ఇది మాదేశము అన్నాడు. రక్షణగా దేశము చుట్టూ కంచె వేసాడు. కర్మాగారాలలో తుపాకులు, యుద్ధ విమానాలు తయారుచేసాడు. ఇక్కడ కాకుండా అంతరిక్షంలో కాలు పెట్టాడు. అక్కడ యంత్రాలు పెట్టాడు. శత్రుదేశము దాడిచేస్తే క్షణాలలో విరుచుకు పడడానికి సైన్యాన్ని సిద్దము చేసాడు. రాకెట్లను తయారు చేసాడు దేనికీ భయపడలేదు.

 

ఇప్పుడు జరుగుతున్న కరోనా యుద్దములో ఒక్క తుపాకీ పేలలేదు. ఒక్క జవాను చనిపోలేదు. ఒక చుక్క ఇంధనం వాడలేదు. ఒక్క విమానము గాలిలో ఎగరలేదు. కానీ శత్రువు 200 దేశాలలో కబళించాడు. దేశాధిపతులు కంట నీరు కారుస్తున్నారు చేసేది ఏమీలేక. ఆ తుపాకీతో గురి పెడదాము అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించని జీవికి భయపడి పోయాడు. ఇప్పుడు అర్ధమైనదా ఇక్కడ నీ పాత్ర ఏంటో ? ఇన్ని రోజులూ లాక్ డౌన్ లో నువ్వు ... ఎక్కడి కి అక్కడ ఆగిపోతే ... అన్ని జీవరాశులూ, చెట్లూ సంతోషముగా ఉన్నాయి. చక్కగా ఊపిరి తీసికొంటున్నాయి. ఓజోన్ పోరా కొలు కొంటున్నది. గంగ సంతోషముగా ఉన్నది.  నీవు ఒకటి గమనించావా? ఈ కరోనా వైరస్ ఒక కీటకానికి, పక్షికి, జంతువుకి రాలేదు. నీకు మాత్రమే వచ్చింది. ఎవరు ప్రకృతిని పాడు చేశారో వాడినే పగ పట్టింది.

 

2 . ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకో. ఈ జీవ రాశులలో నీవు ఒక్కడివి మాత్రమే. గొప్పవాడివి కాదు. అన్ని జీవ రాసులూ గొప్పవే. అదే జీవ వైవిధ్యము. నీ అవసరము ఏ జీవికీ లేదు. ఈ జీవుల వసరము నీకు వుంది. ఈ భూమి మీద నీది ఒక అన్న పాత్ర. బాధ్యతతో మెలగడము నేర్చుకో.

 

3 . నా కేంటి , నాకు ఏమీ కాదు అని మందుల కంపెనీలు చాలా నిర్మాణము చేసావు. కరోనాకి మందు లేదు. నీవు కనిపెట్టినవి దేనికి పనికి వచ్చాయి. నీది మాయ... ప్రకృతిది వాస్తవము , నిజాము.... ఇప్పుడు WHO ఏమి చెబుతుంది. పౌష్ఠిక ఆహారము తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెబుతున్నారు. అది సూపర్ మార్కెట్ లో MNC కంపెనీలలో దొరికేది కాదు. అది భూమి నుండి పంట ద్వారా రావలసినదే ఖచ్చితముగా ప్రక్రుతి వ్యవసాయము ( గో ఆధారితము ) , దేశీ విత్తనము తోనే పౌష్ఠిక ఆహారము అందుతుంది.

 

4 . గాలి ప్రయాణాలు ఆపి కాలు క్రింద పెట్టు. ఇక చాలు నీవు ఎక్కడ పుట్టావో అక్కడికి వచ్చేయి. తినడానికి బతకవద్దు. బతకడానికి తిను. . చస్తూ బతక వద్దు. బతుకుతూ చచ్చిపోదాము. ఒకటి చెప్పు ... అసలు నీకు కావలసినది ఏమిటి ? ఎక్కువ డబ్బులా ? ఎక్కువ ఆరోగ్యమా ? నేల తల్లి అంటున్నది పరుగులు ఆపాల్సిందే. ముందు నడవడము , నిలబడడము . కుదురుగా కూర్చోవడము నేర్చుకో. ఇవి నేర్పడానికి కరోనా వచ్చింది. ఇక్కడ నీవు బాగుండాలని విశ్వములో నేను మాస్కును ( ఓజోన్ పొరను ) వేసుకున్నా. దాన్ని నిలువునా చీల్చావు. అందుకే ఇప్పుడు నీకు మాస్క్ వేసాను.

 

5 నేల తల్లి అంటున్నది. ఇప్పుడు మనిషి ముందు వున్నా అతి పెద్ద సమస్యలు రెండు. ఒకటి భూతాపము తగ్గించడము. రెండవది పౌష్ఠిక ఆహారము. ఈ రెండింటికి పరిష్కారము సుభాష్ పాలేకర్ ప్రక్రుతి వ్యవసాయ విధానము. ఇంకా ఒక్క విషయము. ఈ భూమ్మీద వర్షాలు పడాలంటే తేనెటీగ పాత్ర ఏంటో కీలకమైనది. తేనే నీ ఆహారము కాదు. దాని ఆహారము. నీకు వర్షము కావాలా? తేనే కావాలా?

భూ తాపాన్ని తగ్గించండి. శాఖాహారులు కండి. పాలిథిన్ కవర్లు వాడకండి. చేతి వృత్తులు కాపాడండి.  నేల తల్లి పరిరక్షణలో మనుషులు అందరూ భాగస్వాములం కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: