జమీందారు గారికి ఎవరో మంచి అందమైన పక్షిని నజరానాగా ఇచ్చారు.ఆయన దాన్ని అల్లారు ముద్దుగా చూసుకున్నారు.
మంచి తిండిని, అన్ని వసతులన్ని కల్పించాడు.
ఒక్కటే చింత...ఆ పక్షి ఎగరడం లేదు.ఒక కొమ్మ మీద కూర్చుని ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎగరడం లేదు.ఎంతో మంది వైద్యులు చూశారు. చికిత్సలు చేశారు.కానీ ఫలితం లేదు.
చివరికి ఒక రైతు వచ్చాడు. ఒక పదిహేను నిమిషాల తరువాత ఆ పక్షి ఎగురుతూ కనిపించింది. జమీందారు గారు ఆశ్చర్యపోయారు.
"ఏం మాయ చేశావు?" అని అడిగాడు.
"అది కూర్చున్న కొమ్మల్ని ఒక్కొక్కటిగా నరికేశాను. దాంతో దానికి ఎగరక తప్పలేదు.
అన్నీ కూర్చున్న చోటే అమరితే ఎవరు మాత్రం ఎదుగుతారు?" అన్నాడు రైతు.నేటి తరం పిల్లల పెంపకం ఇలాగె వుంది