కావాల్సిన ప‌దార్థాలు:
కందిపప్పు- 150 గ్రా
మునక్కాడలు- 2
ఉల్లి ముక్కలు- 2
టమోటాలు- 2


పచ్చిమిర్చి- 4
ఎండుమిర్చి- 3
పసుపు - చిటికెడు
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా


చింతపండు- 1 స్పూను 
వెల్లుల్లి ముక్కలు- ఒక‌ టీస్పూను
పోపు దినుసులు - 1 టీస్పూను


ఉప్పు- త‌గినంత‌
కారం- 1 టీ స్పూన్‌
నూనె - తగినంత


తయారీ విధానం: 
ముందుగా మునక్కాడలను తొక్కు తీసి ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసి ప‌క్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్‌ కుక్కర్‌లో మునక్కాడ ముక్కలు, ఉప్పు, సరిపడా నీళ్లుపోసి రెండు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించాలి. నీళ్లు వార్చుకుని గిన్నెలో వేసుకోవాలి. ఆ త‌ర్వాత ప్రెషర్‌ కుక్కర్‌లో కందిపప్పు, ఉల్లిపాయలు, పసుపు, టమోటాలు, నీళ్లు పోసి 3 విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించి చల్లార్చాలి.

తర్వాత పప్పు రుబ్బుకుని తాలింపు వేసుకోవాలి. దీన్లోనే ఉడికించిన ములక్కాడ ముక్కలు, ముందుగా నీళ్లలో నానబెట్టుకున్న‌ చింతపండు పులుసు, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు చివ‌రిగా కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన కందిప‌ప్పు మునక్కాయ క‌ర్రీ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: