ఖర్జూర పండ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అనేక పరిశోధనలు ఇప్పటికే తెలియచేశాయి. తక్షణ శక్తిని అందించడంలో ఖర్జూరాలకు మించిన ఆహారం మరొకటిలేదు. ఇవి తిన్న వెంటనే శక్తి బాగా రావడమే కాకుండా ఉత్సాహం కూడా బాగా వస్తుంది. దీనికితోడు మన శరీరానికి కావల్సిన కీలక మినరల్స్ విటమిన్స్ ఖర్జురాలలో ఉండటంతో ఈమధ్య వీటివాడకం విపరీతంగా పెరిగింది.
ఈక్రమంలోనే ప్రతిరోజు రెండు మూడు ఖర్జూరాలను బాగా నలిపి ఒక గ్లాసు పాలలో వేసి బాగా మరిగించి ఆపాలను తాగితే ఎన్నో లాభాలు ఉంటాయని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. ఈపాల వల్ల రక్తహీనత పోతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు ఈపాలను తాగితే రక్తం త్వరగా తయారవుతుంది. అదేవిధంగా బాగా అలసటగా ఉండేవారు నీరసంగా ఉన్న వారు ఖర్జూరం పాలను తాగితే వెంటనే శక్తి లభిస్తుంది.
దీనికితోడు జీర్ణసంబంధ సమస్యలైన గ్యాస్ అసిడిటీ అజీర్ణం సమస్యలకు ఈ ఖర్జూరం పాలు ఎంతగానో ఉపయోగ పడటమే కాకుండా చాలా మందికి సమస్యగా మారిన మలబద్దక సమస్యకు ఖర్జూర పాలు మేలు చేస్తాయి. ముఖ్యంగా నేత్ర సమస్యలతో బాధ పడేవారికి అనారోగ్య సమస్య పరిష్కారంలో ఈపాలు ఎంతగానో సహకరిస్తాయి.
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రా తొలగించి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందడంలో ఈ ఖర్జూర పాలు ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగు పరచడంలో అదేవిధంగా జ్ఞాపకశక్తి పెంపుదడంలో ఈపాలు తీసుకునే వారికి చాలా ప్రయోజనం కలుగుతుందని వైద్యులు కూడ అంగీకరిస్తున్న సత్యం..