పాలను భాధ పెడితే పెరుగు వస్తుంది.
పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది.
వెన్నని సతాయిస్తే నెయ్యి వస్తుంది.
పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ.
కానీ, ఈ నాలిగింటి రంగు తెలుపె.
దీని అర్థం ఏమిటంటే... మాటిమాటికి దుఃఖం, పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో, సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.
పాలు ఉపయోగ పడేవే, కానీ ఒక రోజు కోసమే..తరువాత అవి ఖరాబు ఐపోతాయి....
పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేయడంతో అది పెరుగు అవుతుంది...కానీ రెండు రోజులే ఉంటుంది...
పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది. ఇది కూడా 3 రోజులు ఉంటుంది...
వెన్నని కాచి నప్పుడు నెయ్యి వస్తుంది. నెయ్యి ఎప్పుడూ ఖరాబు అవ్వదు...
ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది...
అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేన్నని శక్తులతో నిండి ఉంది, దానిలో కొన్ని మంచి ఆలోచనలిని నింపి..మీకు మీరే చింతన చెయ్యండి...మీ జీవితాన్ని సరిచేసుకుని అప్పుడు చూడండి....
మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి అవుతారు



మరింత సమాచారం తెలుసుకోండి: