మహాభారతం రామాయణం మన హైందవ ఇతిహాసాలు. మనకు ఆదర్శాలు. రామాయణం అనుసరిస్తూ, మహాభారత పోకడల నుండి తప్పించుకొంటూ జీవించటం మంచి పౌరునిగా జీవనం గడపటానికి సర్వదా అనుసరణీయం. 

"మన ప్రవర్తన ఎలా ఉండాలి?" -  అనే ప్రశ్నకు సమాధానం రామాయణమైతే 

"లోకం పోకడ ఎలా ఉంది?" అనే ప్రశ్నకు సమాధానం మహాభారతం.

మన ప్రవర్తన ఎలా ఉండాలో రామాయణంలోని పాత్రలు చెబుతాయి:

అన్నదమ్ముల అనుబంధం: రామ-లక్ష్మణులు
స్నేహం: రామ సుగ్రీవ మైత్రి
తండ్రీ కొడుకుల అనుబంధం: దశరథ-రాములు
యజమాని-సేవకులు: రామ-హనుమ
పాలకుడు-ప్రజలు: రాముడు-అయోధ్యవాసులు 

ఐతే భార్యాభర్తల అనుబంధమెలా ఉండా లో తెలుసుకోవడానికి మాత్రం రామాయణంలో వెదక్కండి. ఒక ఆదర్శవంతుడైన పాలకుడిగా ఉండాలో, లేక ఒక మంచి భర్తగా ఉండాలో నిర్ణయించు కోవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు రాముడు ఒక మంచి పాలకుడిగా ఉండడానికే నిశ్చయించుకున్నాడు. 

ఎటుతిరిగీ తన తప్పేమీ లేకుండా ఆ నిర్ణయానికి బలైపోయింది ఒక్క సీత మాత్రమే. 

ఇక మహాభారతం విషయానికొస్తే అది దాయాదుల మధ్య రాజ్యం, అధికారం, సంపద, మగువ కోసం జరిగిన సమరం. ఇలాంటి సమస్యే రామాయణంలో వాలి-సుగ్రీవుల మధ్య జరిగినట్లు అనిపించినా అక్కడి పరిస్థితులు వేరు. సుగ్రీవుడు తనను చంపడానికి కుట్రపన్నాడని వాలి బలంగా నమ్మాడు. సుగ్రీవుడి సదుద్దేశాన్ని ఋజువు చేసే ఆధారాలు ఏమీ కనిపించవు. పైగా వాలి తిరిగి వచ్చేటప్పటికి సుగ్రీవుడు తన అగ్రజుడు వాలి - భార్య రుమ తో - ఉంటూ, వాలి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. తన రాజ్యాన్ని, అర్ధాంగిని అనుభవిస్తున్న సుగ్రీవుడి మీద వాలి ద్వేషం పెంచుకున్నాడు. 

ఈ తరుణంలో ఇక సుగ్రీవుడు చెప్పేది ఏ మాత్రమూ నమ్మని వాలి నేరుగా సుగ్రీవుడిని చంపటానికివస్తే సుగ్రీవుడికి పారిపోవ డమో? ఎదురు తిరగడమో? తనకు వాలిని ఎదుర్కొనే సామర్ధ్యం ఎలాగూ లేదు కాబట్టి మరొక మిత్రుని శరణు వేడటమో తప్ప వేరే దారి లేదు కదా!  

మహాభారతంలో  కౌరవులు-పాండవుల మధ్య మౌలికంగా ఎటువంటి తేడా కనబడదు. వాళ్ళు చేసింది అధర్మ మైతే వీళ్ళూ తక్కువేమీ చెయ్యలేదు. వీళ్ళు వీరులైతే వాళ్ళ వైపు అంతకంటే గొప్ప వీరులున్నారు. 

ధర్మరాజుగా పిలవబడే యుధిష్ఠిరుడు జూదం ఆడేటప్పుడు ఎంతటి హీనస్థితికైనా దిగజారుతాడని ఒకసారి కాదు రెండు సార్లు ఋజువైంది. ఇతర విషయాల్లో కూడా అతడి ప్రవర్తన ఉదాత్తంగా అనిపించదు. అతడికి ధర్మం తెలుసు. కానీ తనకు తెలిసిన ధర్మాన్ని అతడు పాటించకపోవటంలోనే వచ్చిన తంటా — తేడా.

జూదం సప్తవ్యసనాల్లో ఒకటి. తప్పుడు పని — ఎవరు చేసినా తప్పే. జూదం యుధిష్ఠిరుడి అతి పెద్ద బలహీనత – తనతో బాటు తోడబుట్టినవాళ్ళను, కట్టుకున్నపెళ్ళాన్ని సైతం తాకట్టు పెట్టేంత సోయిలేని వ్యసనపరుడు. అతడు పందెంగా ఒడ్డిన ద్రౌపది అతడొక్కడికే భార్య కాదు! ఆమెను ఒడ్డే ముందు ఆమె ఆమోదం, ఆమె ఇతర భర్తల అంగీకారం తీసుకోవాలనే కనీస బాధ్యత కూడా తెలియనంతగా ఆ వ్యసనానికి బానిస అయ్యాడు. 

ఈ రకమైన వ్యసనాన్ని సాంప్రదాయవాదులెవరైనా ఏలా సమర్థిస్తారు.  అందులోనూ గుణపాఠం పొందిన తరవాత కూడా ఇవే పందాలు ఒడ్డి ఓడిపోవడం వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. మొదటిసారి ఓడిపోయినప్పుడు ద్రౌపదికి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతో దాస్య విముక్తి పొందిన వాడు, మళ్ళీ వెంటనే గుడ్డిగా జూదానికి సిద్ధ టమేమిటి అనేది ప్రధాన ప్రశ్న. 

ఈ రకమైన బలహీనతలున్న వాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండకూడదు. కేవలం దృష్టి లోపం వల్ల ధృతరాష్ట్రుడు రాజ్యపాలనకు అనర్హుడుగా గుర్తించబడితే ఈ జూదరి వ్యసనపరుడు అయిన ధర్మజుడూ అనర్హుడే కావాలి. ఇక అందరికీ తెలిసినా గుర్తించడానికి ఇష్టపడరు. చారిత్రక దృక్పథంతో చూసినప్పుడు కృష్ణుడు భగవత్స్వరూపమనే విషయాన్ని మరిచి పోయి పరిశీలిస్తే: 

భీష్ముడి మరణం: యుద్ధభూమిలో రాత్రిపూట శతృశిబిరానికి వెళ్ళి "తాతా! నువ్వు చచ్చిపో! లేదా కనీసం నిన్నెలా చంపాలో నువ్వే చెప్పు" అన్న హీనస్థితి ధర్మజునిది.


Related image

ద్రోణుడి మరణం: యుద్ధంలో గెలవాలంటే గురువును చంపక తప్పదని ముందే తెలుసు. కానీ చంపడానికి అవలంబించిన విధానమే అనైతికం. 'మిన్ను విరిగి మీద పడినా సరే వీడు అబద్ధమాడడు' అని నమ్మించి అతి ఘోరమైన అబద్ధంతో గురువు ప్రాణాలనే బలిగొన్నవాడు యుధిష్ఠిరుడు. 


అది అనైతికం కాదనే వాళ్ళు ఒక్కసారి నిష్పాక్షికంగా ఆలోచించండి: ద్రోణుడికి వినబడేలా చెప్పిందేమో పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెప్పలేని పిరికి వాడు, అబద్ధాన్ని నిజంలా భ్రమింప జేయడానికి మరింత కుటిలత్వానికి పాల్పడి నవాడు యుధిష్ఠిరుడు.

Image result for kurukshetram hindu mythology images

ఇక కర్ణుడి మరణంలోనూ, దుర్యోధనుడి మరణం లోనూ జరిగింది అధర్మమే. "నిరాయుధుల మీద ఆయుధాన్ని ప్రయోగించరాదు." ఇది యుద్ధనీతి. భీష్ముణ్ణీ, ద్రోణుణ్ణీ ఆయుధం ప్రయోగించ లేని స్థితిలోకి నెట్టీ, కర్ణుణ్ణి నిరాయుధుడుగా ఉన్నప్పుడూ చంపడం జరిగింది. వాళ్ళలో ఏ ఒక్కరు మరణించక పోయినా యుద్ధ ఫలితం కుడి ఏడమై ఉండేది. 


ఇక గదాయుద్ధం లో ప్రథమ నియమం: దుర్యోధనుణ్ణి చంపిందేమో గద తో తొడలు విరగ్గొట్టి, గదను ప్రత్యర్ధి నాభి క్రింది భాగంలో ప్రయోగించ రాదన్న గదా యుద్ద నీతిని, నియమాన్ని తుంగలోకి తొక్కివేయటమే కదా! 

Image result for duryodhana and bhima fight

చిన్నప్పుడు భీముణ్ణీ, పెద్దయ్యాక లక్క ఇంట్లో పాండవులందరినీ చంప బూనడం, మాయాజూదం కౌరవులు చేసిన నేరాలైతే, వాటిని సాకులుగా చూపి పాండవులు చేసిన తప్పుడు పనులు అంతకంటే ఎక్కువే అని పండిత పామరజనాలకు నచ్చ చెప్ప టమే కదా! యుద్ధం ధర్మబద్ధంగా జరిగి ఉన్నట్లైతే పాండవులు అత్యంత దయ నీయంగా  ఓడిపోయి ఉండేవాళ్ళు.


మహాభారత యుద్ధం చరిత్రే. అందులో అనుమానం లేదు. ఐతే స్వర్గారోహణ పర్వం లాంటివి కేవలం కవుల కల్పన. "ఒక్క విజయం వంద తప్పుల్ని కప్పేస్తుంది" అన్నట్లు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పొందిన అంతిమ విజయం వారి లోని లోటుపాట్లను కప్పేసి వారిని కథానాయకులను చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: