నేటి త‌రుణంలో మ‌న జీవ‌న విధానంలో మ‌నం అనుస‌రిస్తున్న అల‌వాట్లు, చేస్తున్న పొర‌పాట్ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటిల్లో స్థూల‌కాయం, గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ లు చాలా ముఖ్య‌మైన‌వి. ఇవే కాదు, మ‌నం చేస్తున్న అనేక ప‌నుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం పాటిస్తున్న కొన్ని అల‌వాట్లు  వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1.భోజ‌నం ముగిసిన వెంట‌నే స్నానం చేయ‌రాదు. అలా చేస్తే ఆయుర్వేదం ప్ర‌కారం మ‌న శ‌రీరంలో ర‌క్తం అన్ని భాగాల‌కు స‌ర‌ఫ‌రా అవుతుంది. దీంతో జీర్ణాశ‌యానికి ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గుతుంది. ఫ‌లితంగా తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవ్వ‌దు. దీనికి తోడు గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

2.  భోజ‌నం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ స్మోకింగ్ చేయ‌రాదు. చేస్తే పొగాకులో ఉండే నికోటిన్ మ‌న శ‌రీరంలో జరిగే జీర్ణ క్రియ‌ను అడ్డుకుంటుంది. అలాగే శ‌రీరం క్యాన్స‌ర్ క‌ణాల‌ను గ్ర‌హించి క్యాన్స‌ర్ వ‌చ్చేలా చేస్తుంది. క‌నుక భోజ‌నం చేశాక పొగ తాగ‌రాదు.

3.  భోజనం చేశాక టీ, కాఫీలు, గ్రీన్ టీ తాగ‌రాదు. తాగితే శ‌రీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ఐర‌న్‌ను స‌రిగ్గా గ్ర‌హించ‌లేదు. క‌నుక భోజ‌నం చేశాక గ్రీన్ టీ కూడా తాగ‌కూడ‌దు.

4. చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే ప‌లు ర‌కాల పండ్ల‌ను తీసుకుంటుంటారు. కానీ అలా చేయ‌రాదు. ఎందుకంటే మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సరిగ్గా గ్ర‌హించాలంటే పండ్ల‌ను తిన‌రాదు. అయితే పండ్ల‌ను తినాలంటే భోజ‌నం చేశాక క‌నీసం 60 నిమిషాల వ్య‌వ‌ధి ఉండేలా చూసుకోవాలి. అలా పండ్ల‌ను తింటే ఏమీ కాదు.

5.  ఆహారం తీసుకున్న వెంట‌నే నిద్రించ‌రాదు. అలా చేస్తే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. గ్యాస్ వ‌స్తుంది. స్థూల‌కాయం స‌మ‌స్య వ‌స్తుంది.

6.  ఈత కొట్ట‌డం, వ్యాయ‌మం చేయ‌డం, ప‌నులు చేయ‌డం వంటి వాటిని భోజ‌నం చేశాక చేయ‌రాదు. క‌నీసం 30 నుంచి 60 నిమిషాల గ్యాప్ త‌రువాతే ఆ ప‌నులు చేయాలి. లేదంటే జీర్ణాశ‌యంలో గ్యాస్ పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. అది ఇబ్బందిని క‌లిగిస్తుంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: