ఇక ఆదివారం వస్తే బిగ్‌బాస్‌ ఇంటిసభ్యుల్లోంచి ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి వస్తుంది. వాస్తవానికి బిగ్‌బాస్‌ హౌస్‌లో వీకెండ్‌ వచ్చిందంటే సందడి నెలకొంటుంది. ఇంటి సభ్యులకు ఆ రెండు రోజులు కొత్త మొహం కనపడుతుంది. హోస్ట్‌ రూపంలో నాగార్జున వచ్చి సందడి చేయడం మాములే. హౌస్ వాళ్ళు చేసిన తప్పులను సరి చేస్తాడు. ఇక హౌస్‌లో అప్పుడప్పుడు కొత్త అతిథులు కూడా వస్తారు. అదే విధంగా ఆదివారం రాత్రి  జరిగే ఎపిసోడ్‌లో ఇస్మార్ట్‌ శంకర్‌ సందడి చేశాడు. నటీనటులు రామ్‌, నిధి అగర్వాల్‌ ఇద్దరూ  నాగ్‌తో పాటు హల్‌చల్‌ చేశారు. ఇక ఎలిమినేషన్‌ విషయమై లోపల ఉన్న వారికి గుండె దడ మొదలైంది. అయితే బయట ఉన్న ప్రేక్షకులకు కూడా అంతే ఉత్కంఠ ఉన్నా కూడా ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో ఉత్కంఠత నెలకొంది. 

రెండవ ఆదివారం కార్యక్రమంలో రామ్‌, నిధి పాల్గొని మరింత సందడి వాతావరణాన్ని తీసుకువచ్చారు.   వీరితో నాగ్‌, ఇంటి సభ్యులు కలిసి బాగానే ఎంజాయ్‌ చేసినట్టు కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా జ్యోశ్యం ఫలించిందని చెప్పాలి. ఈ ఎలిమినేషన్ తో హౌస్ ఒక్కసారిగా దుక్కసాగరంగా మారిపోయింది. ఒక బంధం ఎందుకు ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. కానీ  కేవలం పదిహేను మందిని ఒకే ఇంట్లో పడేసి.. వారికి టీవీ,ఫోన్‌, నెట్‌ ఇలా అన్నింటిని దూరం చేస్తే ఎలా ఉంటుందో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. బిగ్‌బాస్‌ హౌస్‌లో కోపాలు, తాపాలు, బాధలతో పాటు బంధాలు కూడా ఏర్పడతాయి.

గత సీజన్‌లో పాల్గొన్నవారిలో దాదాపు అందరూ ఎప్పుడోకప్పుడు కలుసుకుంటూనే ఉంటారు. ఇక ఈ మూడో సీజన్‌లో ఇప్పటి వరకు బాబా భాస్కర్‌, జాఫర్‌లు మాత్రమే చాలా దగ్గరయ్యారు. వీరిద్దరు కలిసి చేసే కామెడీని వీక్షకులు ఇష్టపడుతుంటారు.  అప్పుడప్పుడు కెమెరాలతో చేసే కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్‌ అయ్యారు.  ఫ్రెండ్‌ షిప్‌ రోజే బాబా భాస్కర్‌, జాఫర్‌లు విడిపోయారు. ఈ సంఘటనతో బాబొ భాస్కర్నె కంట తడిపెట్టారు. జాఫర్ బయటకు వస్తూ.. బాబా భాస్కర్ ను ఏమనొందని చెప్పి మరి వచ్చారు.  హౌస్‌మేట్స్‌ కూడా ఫ్రెండ్‌షిప్‌ డేను సెలబ్రేట్‌ చేసుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: