సోషల్ మీడియా అంటే ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి మేలైన మార్గం అని అందరికి తెలిసిందే.. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఎక్కడో ఉన్న విషయాలు ఎంత ఫాస్ట్ గా తెలుస్తున్నాయో.. అంతే ఫాస్ట్ గా గాసిప్స్, సినీ తారలపై ట్రోల్స్ రావడం కూడా ఈరోజుల్లో కామన్ అయిపోయింది. హీరోల కన్నా కూడా, హీరోయిన్ల పై, సెలెబ్రెటీ యాంకర్లపై ఈ ట్రోల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయన్న విషయం తెలిసిందే.. అసలు విషయానికొస్తే.. బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ రోజుకో వార్తలతో న్యూస్ దర్శనమిస్తుంది. అంతేకాకుండా రోజుకో విదంగా ఫోటో షూట్ చేసి నెటిజన్లతో ట్రోల్స్ కూడా వేయించుకుంటుంది. 
ఇకపోతే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయింది. అందులో భాగంగా ఆమెపై వస్తున్నా ట్రోల్స్ పై స్పందించింది. పెళ్ళై ఇద్దరు పిల్లలున్న కూడా పొట్టి, పొట్టి బట్టలకు పాదాన్యం ఇస్తుండటంపై అందరుతో ట్రోల్స్ వేయించుకుంటున్నా సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వాటికి దీటుగా గట్టి సమాధానం ఇస్తుంది కూడా. ఈ విషయంపై అందిరికి తెలిసేలా ఒక క్లారిటీ ఇచ్చింది. నన్ను బయట వాళ్ళు ఎవరేమనుకున్నా కూడా నా కుటుంబ సభ్యులు వాటిని ఏ మాత్రం లెక్క చేయకపోవడం నిజంగా నా అదృష్టం అని అను చెప్పుకొచ్చింది. 
నేను ఎప్పుడు నా పని నేను చేసుకుంటూ వస్తాను. అయినా కూడా నన్ను వదలకుండా ఎప్పుడు ఏదొక విదంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను ఎవరిని పర్శనల్ గా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎక్కడ లేవు. నాపై వస్తున్నా ట్రోల్స్ కి నేను చాలా సార్లు ఏడ్చినా సందర్భాలు కూడా లేకపోలేదు అని అనసూయ వెల్లడించింది. నేను కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇలాంటి వి వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిపై పోరాడుతూనే వస్తున్న అని అనసూయ పేర్కొన్నారు. 
మరో విషయమేంటంటే.. ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. ఈయన సినిమాలు అన్ని ఒక అంశాన్ని చూపిస్తూ ఉంటాయి. అందుకే అయన సినిమాలు అన్ని నాకు నచ్చుతాయి. అతని డైరెక్షన్లలో సినిమా అవకాశం వస్తే చేస్తాను కూడా అను చెప్పుకొచ్చింది. ఇకపోతే అలాంటి ఆయనకు నాకు మధ్య ఎదో ఉంది అని రకరకాల పుకార్లు వచ్చాయి. ఎవరినైనా ఇష్టపడితే లింకులు పెడతారా అని ఆమె క్వశన్ వేసింది. అలాంటి ట్రోల్స్ రావడంపై నేను చాలా ఫీల్ అయ్యాను. అంతటి పెద్ద ఆయనతో నాకు సంబంధాలు పెట్టకండి ప్లీస్ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది అనసూయ. 


మరింత సమాచారం తెలుసుకోండి: