సగ్గుబియ్యం అని అనగానే ముందుగా పండగనాడు చేసే పరమాన్నం గుర్తొస్తుంది. కానీ సగ్గు బియ్యంతో ఎన్నో చిరుతిళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ వంటల జాబితాలో చిన్నారులు ఇష్టపడే సగ్గుబియ్యం పకోడీ కూడా ఒకటి ఉంది. అది ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.  


కావలసిన పదార్ధాలు...             


సన్న సగ్గుబియ్యం 


చిక్కని పెరుగు


బొంబాయి రవ్వ 


బియ్యప్పిండి - అరకప్పు చొప్పున


 ఉల్లిపాయలు (పెద్దవి) - 2


 అల్లం తురుము - 2 చెంచాలు


 పచ్చిమిర్చి తురుము - 4 చెంచాలు


 ఉప్పు- రుచికి సరిపడా


నూనె - వేయించడానికి సరిపడా


తయారీ విధానం 


ముందుగా గిలకొట్టిన పెరుగులో సగ్గుబియ్యాన్ని 5 గంటల పాటు నానబెట్టాలి. అవి బాగా నానాక బియ్యప్పిండి, బొంబాయిరవ్వలో వాటిని కలిపి, ఆపై.. సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్నిబట్టి ఇంకా పెరుగూ కలుపుకోవచ్చు. ఆ తర్వాత.. గిన్నెలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ పిండిని పకోడీల మాదిరిగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి నచ్చిన చట్నీతో నంజుకు తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి సాయింత్రం సమయంలో పిల్లలకు స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: