కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు- కప్పు
పసుపు- అరచెంచా
సాంబార్ పొడి- చెంచా
ఉల్లిపాయలు- రెండు
బియ్యం- రెండుకప్పులు
పచ్చిమిర్చి తరుగు- చెంచా
అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా
నెయ్యి- రెండు టేబుల్స్పూన్లు
ఉప్పు- తగినంత
కరివేపాకు రెబ్బలు- రెండు
టొమాటో- ఒకటి
బంగాళాదుంప- ఒక్కోటి చొప్పున
నానబెట్టిన పెసరపప్పు- టేబుల్స్పూను
కొబ్బరితురుము- రెండు చెంచాలు
నానబెట్టిన మినప్పప్పు- టేబుల్స్పూను
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసి, కారం, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించి.. పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరితురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి.
రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ రొయ్యల కిచిడీ రెడీ.. రొయ్యల కర్రీ ఇష్టపడని వారు ఇలా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు.