తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసులు పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ హీరోలుగా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇప్పుడు మరో ఇద్దరు హీరోలు వెండి తెరకు పరిచయం అయ్యారు..వాళ్లలో ఒకరు చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ, మరోకొరు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఈ ఇద్దరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు మంచి విజయం సాధించాయి.ఇక సాయిధరమ్ తేజ ‘రేయ్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా దానికంటే ముందు ‘పిల్లా నువ్వు లేని జీవితం ’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత 'సుబ్రమణ్యం ఫర్ సేల్' రిలీజ్ అయ్యింది ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ రావడంతో మనోడికి తెలుగు ఇండస్ట్రీలో మంచ భవిష్యత్ ఉందని కన్ఫామ్ అయ్యింది. 

ఇక దర్శకుడు హరిష్ శంకర్ కూడా ఇండస్ట్రీలో కాస్త బ్యాడ్ టాక్ వచ్చిన తరుణంలో కసితో   ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాడు. అందుకే మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకొని సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన చిత్రం  'సుబ్రమణ్యం ఫర్ సేల్' . రెజీనా అంద‌చందాలు.. ధ‌ర‌మ్ తేజ యాక్ష‌న్‌.. అంత‌కు మంచి హ‌రీశ్ శంక‌ర్ డైరెక్ష‌న్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ చిత్రం బిజినెస్ ముగిసింది. ఈ చిత్రం దాదాపు 20 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

'సుబ్రమణ్యం ఫర్ సేల్'  పోస్టర్


 ఏరియావైజ్ కలెక్షన్లు చూద్దామా..!!

నైజాం : 6.00 కోట్లు

వైజాగ్ : 1.92 కోట్లు

ఈస్ట్ : 1.54 కోట్లు

వెస్ట్  : 1.03 కోట్లు

కృష్ణ  : 1.00 కోట్లు

గుంటూరు : 1.45 కోట్లు

నెల్లూరు  : .0.72 కోట్లు

సీడెడ్ :  2.85 కోట్లు 

కర్ణాటక    : 1.20 కోట్లు

అమెరికా   : 0.43 కోట్లు

రెస్టాప్ ది ఇండియా  : 0.18 కోట్లు

............................................

మొత్తం : 18.32 కోట్లు
..........................................


మరింత సమాచారం తెలుసుకోండి: