కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా వేదలం సినిమా ఆన్ లైన్లో ఫుల్ మూవీ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. అజిత్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 10న తమిళ , తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుండగా నిన్న ఆన్ లైన్లో ఫుల్ మూవీ దర్శన మివ్వడంతో చిత్ర యూనిట్ అంతా షాక్ కి గురయ్యారు. శివ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. అజిత్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఇలాంటి దెబ్బ తగలడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.


టాలీవుడ్లో కూడా పవర్ స్టార్ నటించిన అత్తారింటికి దారేది సినిమా మొదటి భాగం మొత్తం లీక్ అయ్యి సెన్షేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ మాంజి సినిమా కూడా ఇలానే రిలీజ్ కు పది రోజుల ముందే ఆన్ లైన్లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఆన్ లైన్లో లీక్ అయిన సినిమాను బ్లాక్ చేసిన దర్శక నిర్మాతలు.. దానికి కారణమైన వారిని వెతికే పనిలో ఉన్నారు. అసలే సినిమా రిలీజ్ తర్వాత పైరసీ అనే భూతం సినిమా పరిశ్రమను అల్ల కల్లోలం చేస్తుంది అని భాధపడుతుంటే.. ఇప్పుడు ఈ ప్రి రిలీజ్ ప్రైరసీ కూడా దర్శక నిర్మాతలకు, హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రస్తుతం సినిమా లీక్ అవ్వడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.


సినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు సినిమా రిలీజ్ కంటే ముందు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టట్లేదు. రిలీజ్ కు ముందే అజిత్ వేదలం సినిమా లీక్ అవ్వడం అజిత్ కూడా ఆశ్చర్య పడేలా చేసింది. తల సినిమా లీక్ కు పాల్పడిన వారి పట్ల గట్టి చర్యలే తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంకా సినిమా ఎలా లీక్ అయిందన్న కారణాలు మాత్రం తెలియలేదు. ఇటు ఓ పక్క సినిమా రిలీజ్ కూడా దగ్గర పడటంతో సినిమా లీక్ అయిన విషయం కన్నా సినిమా ప్రమోట్ చేసుకునే ఆలోచనలోనే చిత్ర యూనిట్ ఉన్నారు.


సినిమా మాత్రం అనుకున్న విధంగా ఈ నెల 10న రిలీజ్ చేసే విధంగానే చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి లీక్ అయిన ప్రింట్ కూడా చాలా నీట్ గా ఉందని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ సినిమా ఓపెనింగ్ మీద పడే అవకాశం ఉందా లేదా అన్నది రిలీజ్ నాటి దాకా ఆగి చూడాలి. ఈ సినిమా తెలుగులో ఆవేశం గా రిలీజ్ అవుతుండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: