ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన మూవీలు బాక్సాపీస్ వద్ద అంతగా అలరించలేకపోతున్నాయి. కానీ, కోలీవుడ్ బాక్సపీస్ వద్ద రిలీజ్ అయిన లేటెస్ట్ ఫిల్మ్స్ , బాక్సాపీస్ ని ఓ ఊపు ఊపుతున్నాయి. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హ‌స‌న్ న‌టించిన తూంగ‌వనం, అలాగే అజిత్ నటించిన వేదాలం సినిమాలు తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమాలు భారీ ఎత్తున విడుద‌లై, బాక్సాపీస్ వద్ద సైతం సూపర్భ్ కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి.


అయితే తమిళనాడులో భారీ వ‌ర్షాల కారణంగా, ప్రేక్షకులు ఎక్కవ మంది థియోటర్స్ కి చేరుకోలేకపోతున్నారు. దీని కారణంగా బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ కొంత మేర తగ్గాయి. అయితే తూంగవనం మూవీ కంటే అజిత్ నటించిన వేదలం మూవీ బాక్సాపీస్ ని ఓ ఊపుఊపుతుంది. మొద‌టి రోజు వేదాలం సినిమా 15 కోట్లు వ‌సూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక తరువాత రోజు నుండి మాత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి.


నవంబర్ 10న విడుదలైన వేదాలం మూవీ, ఇప్పటి వరకూ 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. మొదటి అయిదు రోజులకి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఆదివారం ఈ మూవీ 7 కోట్ల రూపాయలకి మించి కలెక్ట్ చేసిందని అంటున్నారు. మొత్తంగా 6 రోజుల్లో ఈ మూవీ 60 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం చెన్నైలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: