దేవదాసు కనకాల పేరు ఎరగని వారుండరు. ఈరోజు సినిమా రంగంలో టాప్ హీరోలుగా వెలుగొందుతున్న హీరోలు అంతా దేవదాసు కనకాల వద్ద నటనకు సంబంధించి పాఠాలు నేర్చుకున్న వారే. నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవదాసు కనకాల మెగా స్టార్ చిరంజీవి రజనీకాంత్ రాజేంద్రప్రసాద్ సుధాకర్ లపై ఆశక్తికర కామెంట్స్ చేసాడు. 

చిరంజీవి తొలి రోజులలో తన వద్ద నటన నేర్చుకుంటున్నప్పుడు నటించే విషయంలో బాగా ఇబ్బంది పదేవాడిని. అయితే ఒక మూడు నాలుగు నెలలు గడిచిన తరువాత నటన విషయంలో తన హార్డ్ వర్క్ తో పికప్ అయ్యాడని కామెంట్స్ చేసాడు దేవదాసు కనకాల. ఇక రాజేంద్రప్రసాద్ గురించి మాట్లాడుతూ అతడిని కూడ తాను చాలాసార్లు తిట్టానని చెపుతూ ఇక కమెడియన్ గా కొంత కాలం టాలీవుడ్ రంగాన్ని ఏలిన సుధాకర్ ను తాను ఎన్ని సార్లు తిట్టానో తనకే గుర్తు లేదు అని కామెంట్స్ చేసాడు దేవదాసు కనకాల.

అయితే ఇదే సందర్భంలో చిరంజీవి గురించి మరింత మాట్లాడుతూ చిరంజీవి టాప్ హీరోగా ఎదిగిన తరువాత కూడ తన ఇంటికి ఏదైనా మాట్లాడాలి అని అనిపించినప్పుడు తెల్లవారుఝామున వచ్చే వాడని అయితే ఆ విషయం తెలిసి తెల్లవారుఝామున కూడ జనం తన ఇంటిముందు గుమిగూడుతూ ఉండటంతో చిరంజీవిని ‘అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు, నేనే మీ ఇంటికి వస్తాను’ అని నవ్వుతూ జోక్ చేసే వాడినని చిరంజీవి పట్ల తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

తన కొడుకు రాజీవ్ కనకాల చిన్న పిల్లవాడుగా ఉండే సమయంలో తన భార్య లక్ష్మి తన ఫిలిం కోచింగ్ స్కూల్ లో రాజీవ్ ని క్లాసులోకి తీసుకు వచ్చి పాఠాలు చెపుతున్న సమయంలో రాజీవ్ అల్లరి చేస్తూ ఉంటే రజినీకాంత్ రాజేంద్రప్రసాద్ చిరంజీవిలు ఎత్తుకుని గారాబం చేసే వారని అలనాటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు దేవదాసు కనకాల. ఇదే సందర్భంలో తన కొడుకు  రాజీవ్ కనకాల గురించి మాట్లాడుతూ తన కొడుకు వచ్చిన అవకాశాలు అన్నీ ఉపయోగించుకున్నా కాలం కలిసి రాకపోవడంతో పెద్దగా ఎదగ లేకపోయాడు అన్న అసంతృప్తిని వ్యక్త పరుస్తూ ప్రస్తుతం నటిస్తున్న చాలామంది నటీనటులకు హాఫ్ నాలెడ్జి మాత్రమే ఉన్నది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు దేవదాసు కనకాల.. 



మరింత సమాచారం తెలుసుకోండి: