ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు రాకపోవడానికి గల కారణం హీరోల మధ్య ఉన్న ఇగో సమస్యలే కారణం అంటూ నాగార్జున కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు హీరోలతో ఒక మల్టీ స్టారర్ అనగానే అందులో నటించే హీరోలకు ఎన్ని పాటలు మరిన్ని ఫైట్లు అన్న వాటాల పంపకం వల్ల తన లాంటి హీరోలకు మల్టీ స్టారర్స్ పై అభిరుచి ఉన్నా తరుచు చేయలేకపోతున్నానని నాగ్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇదే సందర్భంలో తాను లేటెస్ట్ గా నటించిన ‘ఊపిరి’ సినిమా గురించి మాట్లాడుతూ హీరో కార్తి లాంటి వ్యక్తులు సినిమా రంగంలో చాల అరుదుగా ఉంటారని కామెంట్ చేసాడు నాగ్. అయితే ఈ సినిమాలో తనను షూటింగ్ సమయంలో వీల్ ఛైర్లో కూర్చోబెట్టి కార్తీ, తమన్నా కలిసి డాన్సులు చేయడం జోక్స్ వేసుకోవడం కొంత వరకు షాక్ ఇచ్చాయని సెటైర్లు వేసాడు నాగ్. 

ఈ నెలాఖరున విడుదల కాబోతున్న ‘ఊపిరి’ సినిమా ప్రమోషన్ ఈరోజు నుంచే ప్రారంభం కాబోతోంది. ఈరోజు సాయంత్రం ఈ సినిమా ఆడియోను చాల భారీ స్థాయిలో విడుదల చేయడానికి పివిపి నిర్మాణ సంస్థ భారీ ప్లాన్స్ రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ కాపీని చూసినప్పుడు  ఈసినిమాలోని  కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదని చాల ఉద్వేగానికి లోనయ్యాను అని అంటున్నాడు నాగ్. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’కు రీమేక్ గా వస్తున్న ఈసినిమా గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రమోషన్ ను భారీ స్థాయిలో చేసి ప్రస్తుతం నాగ్ కు ఉన్న క్రేజ్ రీత్యా భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని పివిపి భారీ ప్రయత్నాలు చేస్తోంది అని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: