తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు బాలీవుడ్ ని ఫాలో చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్టార్ హీరోలుగా నటించిన వారు కూడా కరడు గట్టిన విలన్లుగా కనిపిస్తారు.   ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ లో ఉన్నవారు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా..విలన్లుగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈ కోవలో ముఖ్యంగా జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్,శ్రీకాంత్ లాంటి హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రల్లో వొదిగిపోతున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో నటసింహంగా దూసుకు పోతున్న బాలకృష్ణ తన వందవ చిత్రం ఇప్పటి వరకు చాలా మంది దర్శకుతో అనుకున్నప్పటికీ  కృష్ణ వంశీ ని దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే బాలయ్య వందో సినిమాలో నందమూరి తారక రత్న, నారా రోహిత్ లు కూడా నటించనున్న విషయం తెలిసిందే. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే..ఈ చిత్రంలో బాలయ్యకు విలన్ గా వస్తున్న యంగ్ హీరో ఎవరో కాదు నందమూరి తారక్ రత్న అని తెలుస్తుంది.  తారక రత్న ‘ఒకటో నెంబర్ కుర్రాడు ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మనోడు  నటించిన చిత్రాలు ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఏ ఒక్కటీ విజయం సాధించలేదు. ఇక మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించాలని ఫిక్స్ అయిన తారక్ త్వరలో రాజా చెయ్యి వేస్తే చిత్రలో కనిపించబోతున్నాడు.

నారా రోహిత్, తారక రత్న


బాలయ్య వందో సినిమాలో అబ్బాయి విలన్ గా చేస్తే మాత్ర చాలా సెన్సేషన్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నందమూరి కుటుంబంలో హీరోలుగా వచ్చారే కాని విలన్ గా ఇప్పటి వరకు ఎవరూ కనిపించ లేదు. మరి బాలకృష్ణ వందవ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొంద బోతుంది..ఈ చిత్రంలో తారక రత్న ఏ పాత్రలో కనిపించబోతున్నాడో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: