మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ చిత్రంలో అమాయకంగా కనిపించినా తర్వాత వచ్చిన ఆర్య,బన్ని,దేశముదురు చిత్రాలతో మనోడి విశ్వరూపం చూపించాడు. డ్యాన్స్, ఫైట్స్ లో మామకు తగ్గ అల్లు అనిపించాడు. గత సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో చాలా మెచ్యూర్ గా నటించాడు బన్ని. ఈ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని  సన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో  ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకొన్న 'సరైనోడు' టీమ్ తాజాగా ఓ పాట చిత్రీకరణ కోసం సౌత్ అమెరికాలోని బొలీవియాకి వెళ్ళింది. దీనికి సంబంధించి టీమ్ మొత్తం ఫ్లైట్ లో దిగిన ఫోటో ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ నెల 13 వరకు ఇక్కడే షూటింగ్ చేస్తామని, ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ నుంచి సమాచారం తెలుస్తోంది.

సరైనోడు పోస్టర్


ఇప్పటికే యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ గా వచ్చాయని, సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని చిత్రయూనిట్ థీమా వ్యక్తం చేసింది.బొలీవియాలో తీయబోయే పాటలతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని, మార్చి నెలాఖరులో ఆడియో వేడుక ఉండవచ్చని, ఏప్రిల్‌లో సినిమా విడుదలవుతుందని రకుల్ వెల్లడించింది. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా మెప్పించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: