ఈ మద్య చిన్నా పెద్దా సినిమాలు విడుదలకు ముందు వారి స్థాయిని బట్టి ఆడియో ఫంక్షన్లు నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్లకు సెలబ్రీటీలు రావడంతో జనాలు కూడా ఎగబడి వెళుతున్నారు. అంతే కాదు ఈ ఆడియో వేడుకలు సక్సెస్ లను బట్టి సినిమా విజయం అవుతుందా లేదా అని అంచనాలు వేస్తున్నారు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో షేక్ చేస్తున్న చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించ బోతున్నారు.

తాజాగా అల్లు అర్జున్ త్వరలో రాబోయే ‘సరైనోడు’ చిత్రం ఆడియో వేడుకకు సంబంధించి ఫ్యాన్స్ కి షాక్ న్యూస్ ఇచ్చాడు. వాస్తవానికి తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్ భారీ స్థాయిలో నిర్వహిస్తారని..మెగా ఫ్యామిలీ చూసే భాగ్యం కలుగుతుందని భావిస్తారు..కానీ బన్ని ఇచ్చిన షాక్ తో మెగా ఫ్యాన్స్ కి దిమ్మతిరిగింది.  ఇంతకీ అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన తాజా చిత్ర '' సరైనోడు '' ఆడియో వేడుక నిర్వహించడం లేదు దాని బదులుగా నేరుగా ఏప్రిల్ 1 న పాటలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు.

సరైనోడు పోస్టర్


ఆడియో రిలీజ్ అంటే భారస్థాయిలో ఫంక్షన్ ఉంటుందని అనుకున్న ఫ్యాన్స్ మాత్రం నిరాశే మిగిల్చాడు..ఏదో నామ మాత్రంగా వైజాగ్ లో మాత్రం ఫ్యాన్స్ సమక్షంలో ఓ ఫంక్షన్ చేస్తారట . ఏప్రిల్ 22 సరైనోడు చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . 


మరింత సమాచారం తెలుసుకోండి: