గత కొంత కాలంగా టీమ్ ఇండియా మంచి జోరుమీద కొనసాగుతుంది. ఇప్పటి వరకు టి 20 మ్యాచ్ లో ఒక్క న్యూజ్ లాండ్ తో తప్ప ఏ మ్యాచ్ లోనూ విఫలం కాలేదు..మొన్న T 20 వరల్డ్ కప్ లో భారత్ వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడంతో భారతీయులంతా ఒక్కసారే షాక్ తిన్నారు. అంతే కాదు 193 భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఆటగాళ్ల ముందు ఉంచి కూడా చివర్లో బాగా రన్స్ ఇచ్చి వెస్టిండీస్ విజయానికి బాట వేశారు. భారత్ ఒడిపోవడాన్ని ప్రతి ఒక్కరూ  జీర్ణించుకోలేకపోయారు..కానీ ఒక హీరోయిన్ మాత్రం తెగ ఎంజాయ్ చేసిందట.

వీనా మాలిక్


అంతే కాదు భారత్ ఓడిపోవడం తనకెంతో ఇష్టమని మొత్తానికి భారత్ పరాజయం పొందడం తాను పండుగ చేసుకుంటున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..!బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పాకిస్తాన్ నటి ''వీణా మాలిక్ ''. ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచే ఈ అమ్మడు పాకిస్థాన్ ఓటమి పాలు చేసి భారత్ సంతోష పడిందని అయినా ఇప్పుడు వెస్ట్ ఇండీస్ చేతిలో ఓడిపోవడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని అంటుంది.

ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్


పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టినందుకు నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ వాళ్ళు చాలా బాధపడ్డారు కానీ వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు తెగ సంతోష పడుతున్నారు . ఇక వీణా మాలిక్ అయితే ''మౌకా మౌకా '' అంటూ ట్వీట్ చేసి తన కండ కావారాన్ని ప్రదర్శించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: