తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ వచ్చిన హీరో విజయ్. గత సంవత్సరం విజయ్ నటించిన పులి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దీంతో తన తర్వాతి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రూపొందించిన చిత్రమే తేరి. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ‘తేరీ’ సినిమా తెలుగులో ‘పోలీసోడు’గా రానున్న విషయం తెలిసిందే.  తెలుగు వర్షన్ ఏప్రిల్ 15న విడుదలవుతోంది. ఇక తమిళంలో ఈ ఏడాది భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందిన తేరీ అందుకు తగ్గట్టుగానే పెద్ద ఎత్తున విడుదలవుతోంది.

తెలుగు పోలీసోడు పోస్టర్


డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అందిస్తున్నారు. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు.  అంతా బాగుందీ అనుకున్న సమయంలోనే ఇప్పడు తెలుగు వర్షన్ ‘పోలీసోడు’ చిత్రానికి చిక్కులొచ్చి పడ్డాయి.  

తమిళంలో ‘తేరి’ చిత్రం పోస్టర్


చిత్రానికి పోలీసు అధికారుల సంఘం నుండి అభ్యంతరం వ్యక్తం అయింది . ఈ చిత్ర టైటిల్ పోలీసుల్ని అగౌరవపరిచే విధంగా ఉందని సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్. శంకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపధ్యంలో దిల్ రాజుకు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: