ఈవారం విడుదల కాబోతున్న ‘సుప్రీమ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పెళ్ళి వార్తల పై చాల విభిన్నంగా స్పందించాడు. తన పెళ్ళి పై ఇప్పటికే చాలా రూమర్లు వస్తున్నాయి అంటూ తనకు తెలియకుండానే తన పెళ్లి వార్తలు రాసేస్తున్నారు అంటూ సెటైర్లు వేసాడు. మొదట్లో ఇలాంటివి పట్టించుకుని బాధ పాడేవాడిని అంటూ ఇప్పుడు ఇటువంటి వార్తలు తనకు అలవాటు అయ్యాయి అంటూ కామెంట్స్ చేసాడు. 

ఇదే సందర్భంలో మాట్లాడుతూ తనను ఇదివరకు ఇష్టపడిన అమ్మాయిలందరూ ఇప్పుడిప్పుడే కాంటాక్ట్‌ లోకి వస్తున్నారు అని ఈ రూమర్ల దయవల్ల తన కాంటాక్ట్‌లు కూడా పోయేలా ఉన్నాయి అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు ఈ మెగా యంగ్ హీరో. ఇక ఈ సినిమాలో తాను  ఒక క్యాబ్ డ్రైవర్‌గా కనిపిస్తాను అని అంటూ  ఇందులో తన పాత్ర  చాలా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ అన్న విషయాన్ని బయట పెట్టాడు. 

చిరంజీవి సూపర్‌హిట్ సాంగ్ ‘అందం హిందోళం.. అధరం తాంబూలం’ పాట రీమేక్స్ గురించి మాట్లాడుతూ మొదట్లో ఈ పాటను చేయడానికి తాను చాల భయపడ్డానని అంటూ తన మామయ్య ఈ పాటలో వేసిన స్టెప్స్ కు తాను సరిపోతానా అన్న టెన్షన్ తనను ఈ పాట చిత్రీకరణ సమయంలో వెంటాడింది అన్న విషయాన్ని బయట పెట్టాడు ఈ మెగా యంగ్ హీరో.

‘సుప్రీమ్ హీరో’ అనే ట్యాగ్‌ లైన్ పై స్పందిస్తూ ఈ ట్యాగ్ వల్ల తన బాధ్యత పెరిగింది అంటూ. చిరంజీవిగారు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తే ఆయనకా ట్యాగ్‌లైన్ తనకు కష్ట పడకుండా వచ్చింది అని దానిని నిలబెట్టు కోవడానికి తాను తన శక్తి మేరకు ప్రయత్నిస్తున్న విషయాన్ని బయట పెట్టాడు. కేవలం హీరోగా కాకుండా నెగిటివ్ పాత్రలను కూడ చేయాలని కోరిక తనకు ఉంది అని అంటూ త్వరలో మెగా కుటుంబం నుండి విలన్ పాత్రలను వేసే ఉద్దేశ్యం తనకు ఉంది అన్న విషయాన్ని బయట పెట్టాడు. భారీ సినిమాల మధ్య ఈ సమ్మర్ రేస్ కు వస్తున్న ఈ సినిమా 25 కోట్ల కలక్షన్స్ ను రాబట్టగలిగితే సాయి ధరమ్ తేజ్ కూడ మెగా యంగ్ హీరోలలో టాప్ లిస్టులోకి చేరిపోయే ఆస్కారం ఉంది..  .
 



మరింత సమాచారం తెలుసుకోండి: