తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ అంటే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు..ట్రెండ్ సెట్ చేసేవాడని తెలుసు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిఇండస్ట్రీలోకి ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా తర్వాత వచ్చిన సినిమాలు పెద్ద విజయం సాధించలేదు. తమ్ముడు,ఖుషి,జల్సా చిత్రాలు పవన్ ఇమేజ్ ఒక్కసారిగా పెంచేశాయి..ఈ చిత్రాలతో మెగా ఫ్యాన్స్,మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ స్టార్ ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.. ఇదే సమయంలో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించి ప్రజలకు మరింత చేరువ అయ్యారు పవన్ కళ్యాన్.

మెగా ఫ్యామిలీతో  అన్నా లేజ్నోవా


ఇక పవన్ కళ్యాన్ సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడిన తరుణంలో ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అనుకున్న విజయం సాధించలేదు. మరో వైపు  ఏపి స్పెషల్ స్టేటస్, నీటి సమస్యలకు సంబంధించి ప్రజల ముందుకు వస్తాడని ప్రచారం సాగింది. అయితే వీటన్నింటికి కాస్త పులిస్టాప్ పెట్టి  పవన్ కళ్యాన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవానుకుంటున్నారట.  దీంతో తన మూడో భార్య అన్నా లేజ్నోవా, చిన్న కూతురుతో కలిసి ఓ హాలిడే టూర్‌ని ప్లాన్‌ చేశాడు.  

పవన్ కళ్యాన్ కూతురు


గతంలోనూ పవన్ విదేశీ టూర్లకు వెళ్లిన సమయంలో ఎటువంటి సమాచారం లేకుండా వెళ్లిపోయారు. అయితే పవన్ కళ్యాన్ ఇంత అకస్మాత్తుగా టూర్ సన్నద్దం అయ్యాంటే దీంతో మర్మం ఏమిటా అని చాలా మంది అనుకుంటున్నారు. మరోవైపు ఏపీలో రాజకీయ పరిస్థితి చాలా వాడీ వేడిగా ఉంది. అంతే కాదు సర్ధార్ మూవీ డిజాస్టర్ కావడం మెగా అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ సమయంలో పవన్ కళ్యాన్ కూల్ గా టూర్ వెళ్లడం ఏమిటా దీంట్లో రహస్యం ఏమిటా అని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గం. 

సర్ధార్ గబ్బర్ సింగ్ పోస్టర్


కానీ ఎక్కడికి వెళుతున్నారు.. ఎప్పుడు వెళుతున్నారు అనే విషయాలను మాత్రం పవన్‌ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఇక పవన్ కొత్త సినిమా ఎస్.జె. సూర్య డైరెక్షన్ లో తెరకెక్కనుంది. సినిమా షూటింగ్ కు మరో రెండు నెలలు సమయం ఉంది. ఈ గ్యాప్ లో సూర్య స్క్రిప్ట్, హీరోయిన్ వంటి అంశాలపైన శ్రద్ధపెట్టినట్లు తెలుస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: