ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మద్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో యువ హీరోల మద్య ఎలాంటి విషయాల్లోనూ తేడాలు రాలేదు..ఎంతో ఆరోగ్యవంతమైన పోటీ వాతావరణం ఉండేది.  ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్ ల మద్య కాస్త గ్యాప్ వచ్చినట్లు తెలుసు అయితే చిరంజీవి షష్టి పూర్తి రోజు ఆ గ్యాప్ తొలిగిపోయింది. తర్వాత చిరంజీవి ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ సెట్స్ లోకి వెళ్లడం..ఇక పవన్ కళ్యాన్ అన్నయ్య ఇంటికి వచ్చి మాట్లాడుకోవడం ఇలా ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయారు..అంతే కాదు సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా రావడం ఇద్దరు సెల్ఫీ తీసుకోవడంతో మెగా బ్రదర్స్ హ్యాపీ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

మెగా హీరోలు


ఈ తరుణంలో మొన్నామద్య ‘సరైనోడు’ బ్లాక్ బ్లస్టర్ ఫంక్షన్లో అల్లు అర్జున్ పవర్ స్టార్ గురించి మాట్లాడమంటే ‘చెప్పన్ బ్రదర్’ అని అనడంతో పవన్ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలింది. అయితే ఈ విషయంపై పవన్ ఫ్యాన్స్ వెంటనే బన్నీకి కౌంటర్ ఇచ్చారు. అయితే రీసెంట్ గా మీడియా ఇంటర్వ్యూలో కూడా పవన్ గురించి మాట్లాడను బ్రదర్ అని మరోసారి అనడంతో గొడవ కాస్త పీక్ స్టేజికి వెళ్లిపోయింది.  దాంతో మెగా ఫ్యాన్స్ కుటుంబంలో చీలికలు వచ్చి కొంతమంది అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పాంప్లెంట్స్  కూడా ప్రచురించి మరీ ప్రచారం చేస్తున్నారు .

పవన్ కళ్యాన్, అల్లు అర్జున్


దాంతో ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లిందట. దీంతో మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చాడట . ఫ్యాన్స్ విషయంలో నీ వ్యవహార శైలి ఏం బాగోలేదు , వాళ్ళ విషయంలో మనకు చాలా ఓపిక అవసరం అని హితువు చెప్పాడట చిరు . అల్లు అర్జున్ ని తన ఇంటికి లంచ్ కి రమ్మని ఆహ్వానించిన చిరు ఫ్యాన్స్ విషయంలో ఎలా ఉండాలో వివరించాడట . వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏమి చేయలేమని పైగా ఇప్పుడు మనమంతా ఈ స్టేజ్ లో ఉన్నామంటే అది ఫ్యాన్స్ చలవే అని చెప్పడమే కాకుండా ఈ వ్యవహారం మరీ ముదిరి పాకాన పడక ముందే నాగబాబు ని జోక్యం చేసుకొని వివాదం సద్దుమనిగేలా చేయమని చెప్పారట.


మరింత సమాచారం తెలుసుకోండి: