తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీలో అంత మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్. అన్నబాటలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం..రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. ఓ కవి అన్నట్లు పవన్ కళ్యాన్ అంటే వ్యసనం అని ఆయనతో ఒక్కసారి పరిచయం అయితే జీవితాంతం మరిచిపోలేరని అంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలో పవనీజం తో ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక పవన్ కళ్యాన్ వచ్చిన కొత్తలో పెద్దగా విజయవంతమైన చిత్రాలు ఏవీ రాలేదు.మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న పవన్ కి ‘ఖుషి’తో అద్భుతమైన చిత్రాన్ని అందించారు ఎస్.జే.సూర్య. ఆ దెబ్బతో పవన్ మాస్ ఇమేజ్ తో పాటు క్లాస్ ఇమేజ్ కూడా సంపాదించారు.

సర్ధార్ గబ్బర్ సింగ్ పోస్టర్


తర్వాత వచ్చిన జల్సా, గబ్బర్ సింగ్ చిత్రాలతో టాప్ పోజీషన్లోకి వెళ్లారు. అయితే పవన్ కళ్యాన్ స్వియదర్శకత్వంలో ‘జానీ’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..ఆ దెబ్బతో దర్శకత్వం జోలికి వెళ్లనని అన్నారు. ఇక అత్తారింటికి దారేది చిత్రం తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఉగాది రోజు భారీ అంచనాలతో విడుదలైంది.


ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ అన్ని బాధ్యతలు తీసుకొని చేసినట్లుగా దర్శకత్వంలో కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్లుగా టాక్..అయితే మాస్ మసాలా డోస్ కాస్త ఎక్కువ కావడంతో జనాలకు బాగా బోర్ కొట్టిందట.

ఖుషి పోస్టర్


రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి బ్యాట్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్ల పరంగా 50 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది. తాజగా పవన్ కెరీర్  మలుపు తిప్పిన ‘ఖుషి’ చిత్రానికి సీక్వేల్ చేయబోతున్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాన్ చాలా వెరైటీగా తయారయ్యారు.

ఇది కూడా చదవండి : ఆ బూతు మాటతో.. అలీకి షాక్ ఇచ్చిన రేష్మీ..! @ http://bit.ly/1WeYc5i

తన హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా మార్చి కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాన్. ఎస్.జే.సూర్యతో ఖుషి సీక్వెల్ రి పూర్తిగా సిద్దం అయినట్లుగా తెలుస్తుంది. మరి ఈసారి కూడా పవన్ కొత్త ప్రయోగం ఎంతవరకు అచ్చి వస్తుందో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: