పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వచ్చిన కొత్తలో పెద్దగా విజయవంతమైన చిత్రాలు లేవు..మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ‘తొలిప్రేమ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంతో పవన్ మంచి ప్రేమికుడిగా నటించి తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని పొందాడు.  ఇక ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే పవన్ సరసన నటించిన హీరోయిన్  కీర్తి రెడ్డి. చాలా అమాయకంగా కనిపిస్తూ ఎలాంటి గ్లామర్ తరహా పాత్ర కాకపోయినా ఈ అమ్మడికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తర్వాత కీర్తిరెడ్డికి చెప్పుకోదగ్గ చిత్రాలు లేకపోవడంతో బాలీవుడ్ పయనమైంది..అక్కడ మూడు చిత్రాల్లో నటించినప్పటికీ అక్కడ కూడా గుర్తింపు రాలేదు.

అయితే చివరిసారిగా మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్’ చిత్రంలో మహేష్ అక్కగా నటించింది. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మనవడు హీరో సుమంత్ ని 2004 లో వివాహం చేసుకుంది. తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది. కొంత కాలం తర్వాత సుమంత్, కీర్తిరెడ్డిల మద్య కొన్ని వివాదాలు చోటు చేసుకోవడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

తర్వాత అమెరికాకు వెళ్లిపోయినట్లు అక్కడే ఒక డాక్టర్ ని వివాహం చేసుకున్నట్లు వీరికి ఒక బాబు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా ఓ కజిన్ వివాహంలో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన కీర్తిని చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గుర్తు పట్టలేనంతగా మారిన ఈ భామ చాలా లావెక్కి ఆంటీలా ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: