బాహుబలి సీక్వెల్ లో రానా కి భార్య గా శ్రియ కనిపిస్తుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాని గురించి ఎవ్వరూ మాట్లాడకుండానే అవి పుకార్లు అని తేలిపోయింది. సీక్వెల్ లో మొదటి భాగం లో ఉన్న పాత్రలే ఉంటాయా లేక కొత్తవి యాడ్ చేస్తారా అనే విషయం లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. రాజమౌళి సైతం ఈ విషయం లో సరైన సమాధానం చెప్పడం లేదు. కొత్త తారల్ని తన సినిమా కోసం మౌళి ఎంచుకున్నాడు అంటూ మీడియా లో ఒక వర్గం చెబుతూ ఉండగా ఆ విషయం ధ్రువ పరిచే ఆధారాలు మాత్రం కనపడ్డం లేదు.

 

కొత్త సందేహాలకి తెర తీసే తారలు మాత్రం బాహుబలి సెట్స్ లో కనపడి హంగామా చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం బాహుబలి దీ కంక్లూజన్ క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు హోరా హోరీగా సాగుతున్నాయి. రాజమౌళి తనదైన శైలి లో వీటిని తెరకి ఎక్కించడమే కాక వీటిని సంబంధించిన అప్డేట్ లు ప్రతీ క్షణం సోషల్ మీడియా లో పెడుతున్నారు. వేలాదిమంది జూనియర్ ఆర్టిస్ట్ లతో ప్రభాస్ ప్రధానంగా సాగుతున్న ఈ సన్నివేశాలు నిన్ననే మొదలు అయ్యాయి. మొదటి రోజు అవుట్ పుట్ కూడా చాలా పెర్ఫెక్ట్ గా ఉంది అని చెబుతున్నారు సన్నిహితులు. అయితే ఈ సెట్స్ లో హాట్ హీరోయిన్ ప్రియమణి కనపడ్డం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

 

ఆమెని ఏదైనా పాత్ర కోసం రాజమౌళి పిలిపించాడా? లేదంటే ఆమెనే ఊరికే  బాహుబలి షూటింగ్ చూసేందుకని వచ్చిందా? అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. బాహుబలి షూటింగ్ చూడడం కోసం తనని అనుమతించినందుకు థాంక్స్ అంటూ ఆమె ట్వీట్ చేసింది. యమదొంగ సినిమా సమయం నుంచీ మౌళి కీ ప్రియమణి కీ మధ్యన మంచి అనుబంధం ఉంది. మౌళి భార్య రామా రాజమౌళి కీ ప్రియమణి కీ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది అని అంటూ ఉంటారు. అయితే ఆమె షూటింగ్ కోసం మాత్రమే వచ్చింది అని ఆమె చెబుతున్నా కూడా కొందరు సినిమా కి క్లోజ్ గా ఉండే వర్గాలు ఆమెకి చిన్న పాత్ర కూడా ఇచ్చాడు అని గట్టిగా వాదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: