ప్రభాస్ తాజా చిత్రం ‘మిర్చి’ విడుదలకు ముందే మాంచి వ్యాపారం చేసేస్తోంది. ప్రాంతాల వారీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటోంది. వైజాగ్ ప్రాంతంలో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 3.25 కోట్లు, తూర్పు గోదావరి రూ. 1.90 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 1.70 కోట్లు, నెల్లూరు రూ. 1.50 కోట్లు, కృష్ణా రూ. 1.80 కోట్లు, నైజాం రూ. 8.40 కోట్లు, సీడెడ్ రూ. 5.40 కోట్లు, వోవర్ సీస్ 2.30 కోట్ల వ్యాపారం జరిగినట్టు సమాచారం. మొత్తానికి మిర్చి ఘాటు షురూ అయిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: