దేవీశ్రీప్రసాద్ ఇప్పుడు తెలుగు పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్నాడు. దేవీతో సంగీతం చేయించుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని అందరు నిర్మాతలూ భావిస్తున్నారు. దీంతో దేవీ మరోసారి యమా బిజీ అయిపోయాడు. అయితే,వస్తున్నాయి కదా అని అన్ని చిత్రాలకూ సంగీతం సమకూర్చేందుకు ఓకే అనడం లేదట. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ మధ్యనే నాగార్జున ‘ఢమరుకం’ చిత్రానికి మంచి సంగీతం అందించాడు. ప్రస్తుతం ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి నాగ చైతన్యతో ‘హలో బ్రదర్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే, ఈ చిత్రానికి కూడా మొదట సంగీతం కోసం దేవీనే సంప్రదించాడట. ఆ చిత్రంలో రెండు పాటల్ని రీమిక్స్ చేయాల్సి ఉంటుందని తెలుసుకున్న దేవీ ఈ ప్రాజెక్ట్ ను సున్నితంగా తిరస్కరించాడని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఇదేకాదు, ఏ చిత్రంలోనైనా పాతపాటల్ని రీమిక్స్ చేయడం అంటే దేవికి ఇష్టం ఉండదని అతడి సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: