టాప్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు వచ్చిన ఒక విషమ పరీక్షకు యంగ్ హీరో నాగశౌర్య సమాధానం చూపెట్ట బోతున్నాడని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ఇద్దరికీ ఒకే రకం సమస్య ఏర్పడటంతో ఇప్పడు వారిద్దరికీ నాగశౌర్య మాత్రమే పరిష్కారంగా మారాడు అని టాక్. 

ఆశక్తికరమైన ఈన్యూస్ వివరాలోకి వెళ్ళితే ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ తాము తదుపరి చేసే సినిమాకు సంబంధించి డేట్స్ కోసం ఈ యంగ్ హీరోని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈఆలోచన మొదట ఎవరికి వచ్చింది ఎవరు ఈ రేస్ లో ముందు ఉన్నారు అన్న విషయమే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.  

మహేష్ పవన్ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన ఈ డైరెక్టర్స్ ఇద్దరు స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్దితి  ఏర్పడటంతో విసిగిపోయి అంత గ్యాప్ తీసుకోవటం ఇష్టం లేక ఈ టాప్ డైరెక్టర్స్ ఇద్దరు ఈనిర్ణయం తీసుకున్నారు అన్న వార్తలు వస్తున్నాయి.  

పవన్ కళ్యాణ్ సలహాతో నితిన్ తో ‘అ ఆ’ వంటి హిట్ సినిమాను తీసి పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఖాళీగా కుర్చులోక త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ సలహాతో ఆయన తమ్ముడు కళ్యాణ్ రామ్ తో ‘ఇజం’ పూర్తి చిసిన పూరి కూడ వచ్చే నేలనుంచి ఖాళీ అయిపోతున్న నేపధ్యంలో ఒకేసారి వారివారి మనసులలో నాగశౌర్య మెదిలినట్లు వార్తలు వస్తున్నాయి.  బలం అయిన స్క్రిప్టుఉంటే  చిన్న హీరోతో అయినా హిట్ కొట్టవచ్చు అన్న నమ్మకంతో  ఉన్న వీరిద్దరు నాగశౌర్యను దృష్టిలో పెట్టుకుని రెండు కధలను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.   

నితిన్ లాంటి మిడిల్ రేంజ్ హీరోతో 42 కోట్ల కలెక్షన్ లు సాధించిన త్రివిక్రమ్  తన తరువాత సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ను లాక్ చేయకలిగాడు గాని ఆసినిమా ఎప్పుడు మొదలు అవుతుందో త్రివిక్రమ్ కే తెలియని  పరిస్థితి. ఇలా నెలలు తరబడి పవన్ గురించి ఎదురు చూసే కన్నా ఒక చిన్న హీరోతో సినిమాను స్పీడ్ గా తీసినా 10 నుంచి 12 కోట్లు ఆదాయం వస్తుంది కదా అని త్రివికమ్ ఆలోచన అని టాక్. 

అయితే ఇది పవన్ దృష్టికి వెళ్ళడంతో మళ్లీ త్రివిక్రమ్ కు బ్రేక్ వేస్తున్నట్లు తెలుస్తోంది.  నవంబర్ లేదా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వచ్చేస్తానని ఖంగారు పడవద్దు అంటూ త్రివిక్రమ్ ను బంధీగా మార్చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా చుకున్నా ఈగేమ్ ప్లాన్ లో నాగశౌర్య చిక్కుకోవడం అందరికీ షాక్ ఇస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: