సినిమా ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరో అయిన వారిలో శింబు ఒకరు. తండ్రి దర్శకులు కావడంతో చిన్నప్పటి నుంచిసినిమాపై మోజు పెంచుకున్న శింబు తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చడు. అయితే మొదటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన శింబు తాజాగా మరోసారి నోరు జారి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో నయన తార, హన్సికలతో ప్రేమాయణం నడిపించి మనోడు తర్వాత వారి నుంచి విడిపోయి సంచలన ప్రకటనలు చేశాడు. తర్వాత పలువురు సెలబ్రిటీలపై బాహాటంగానే కామెంట్ చేయడంతో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
అంతే కాదు "బీప్సాంగ్" దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం మహిళలు రచ్చరచ్చ చేయడంతో శింబు క్షమాపణలు చెప్పకతప్పలేదు. దీనిపై మహిళాలోకం ఉవ్వెతున లేచింది..శింబుని క్షమాపణలు కోరమని కానీ మనోడు మాత్రం దానికి ఏమాత్రం స్పందించలేదు. తాజాగా మనోడి నోటి కి మరోసారి పని చెప్పాడు.
ఇప్పటికే దేశంలో తమిళనాడు, కర్ణాటక ల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో కర్ణాటకలో తన సినిమాలు విడుదల చేయబోనని శింబు ప్రకటించినట్టు కథనాలు వచ్చాయి. దీంతో ఇలాంటి వివాదాలను సినిమా స్టార్ రచ్చ చేయడంతో శింబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెటిజన్లు.