పవన్‌ కల్యాణ్ దాసరి నారాయణరావుల మూవీ ప్రాజెక్ట్ అటకెక్కింది అనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో దాసరి నారాయణరావు మరో అడుగు ముందుకు వేసి ఫిలిం చాంబర్ లో లేటెస్ట్ గా రిజిస్టర్ చేసిన ‘బోస్’ టైటిల్ ఫిలింనగర్ లో హాట్ న్యూస్ గా మారింది.  అంతేకాదు ఈ టైటిల్ కు ‘సన్నాఫ్ ఇండియా’ అనే క్యాప్షన్ ను కూడ రిజిస్టర్ చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  

దాసరి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించింది పవన్ కోసమేనా లేదంటే ఆ మధ్య దాసరి చెప్పినట్లుగా తన కొడుకు అరుణ్ కమార్ తో తీయబోయే సినిమా గురించా అన్న ఆ శక్తికర చర్చలు ఇప్పుడు ఫిలింనగర్ లో జరుగుతున్నాయి. అయితే ‘సన్నాఫ్ ఇండియా’ అనే  క్యాప్షన్  పెట్టాడు కాబట్టి అది ఖచ్చితంగా పవన్ సినిమా టైటిల్ మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది.

ఈ టైటిల్ గురించి విన్న వారికి చిరంజీవి ‘ముఠామేస్త్రి’ వెంటనే గుర్తుకు వస్తుంది.  దీనికి కారణం ఆ సినిమాలో హీరో పేరు కూడ బోస్. అప్పట్లో ఆ సినిమా విడుదల అయిన తరువాత చిరంజీవి రాజకీయాలలోకి వస్తాడు అంటూ విపరీతమైన ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం పవన్ ‘జనసేన’ పెట్టి రాజకీయాలలోకి రావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి పోరాటం చేస్తున్న నేపధ్యంలో దాసరి తీయబోతున్న ఈ ‘బోస్’  ఖచ్చితంగా రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా అని అనిపించడం సహజం.  అయితే పవన్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ చేస్తున్న నేపధ్యంలో ఈ సినిమా తరువాత పవన్ త్రివిక్రమ్ కు సినిమా చేయవలసి ఉంది.  

అందువల్ల త్రివిక్రమ్ సినిమా పూర్తి అయ్యాక ‘బోస్’ మొదలు అవుతుందా ? లేదంటే త్రివిక్రమ్ సినిమాను వెనుకకు పెట్టి దాసరి బోస్ ను పవన్ ముందుకు తీసుకు వస్తాడా ? అన్న విషయం పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.  అయితే దాసరి పవన్ ల ‘బోస్’ వార్తలు నిజం అయితే అది టాలీవుడ్ సినిమా రంగంలో మరొక సంచలనమే అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: