ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతోందంటే మామూలుగానే కాస్త హడావుడి ఎక్కువ ఉంటుంది. రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి. అయితే, ఆ మధ్య ‘దమ్ము’ విడుదలైనప్పుడు అందులోని కొన్ని డైలాగులు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను లక్షించి ఎన్టీఆర్ చెప్పాడని ఓ ప్రచారం సాగింది. అంతేకాదు, తెలుగు దేశం అభిమానులెవ్వరూ ఎన్టీఆర్ చిత్రం చూడొద్దని కొన్ని ఎస్.ఎమ్.ఎస్.లు కూడా హల్ చల్ సృష్టించిన సంగతి మనకి తెలిసిందే. ఇదే సీన్ ని మరోసారి తెరపైకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడట ఎన్టీఆర్. ‘బాద్ షా’ ప్రతీ డైలాగునీ ఆచితూచి చెప్పాడట. ఒక మాట చెప్పేముందు అది ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తుందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాడట తారక్. ‘బాద్ షా’ విషయంలో ఎక్కడా ఎలాంటి నెగెటివ్ ప్రచారానికి తావివ్వకుండా ఉండాలని తారక్ పట్టుదలతో ఉన్నాడట. మరి, తమ్ముళ్లు ఈసారి ఏం చేస్తారో? 

మరింత సమాచారం తెలుసుకోండి: