ప్రభాస్ తాజా చిత్రం ‘మిర్చి’ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ట్రేడ్ వర్గాలే ఆశ్చర్య పోయాలా ‘మిర్చి’  సినిమా వసూళ్ళు సాధిస్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమా కలెక్షన్లకు ముఖ్య స్థావరమైన నైజం ప్రాంతంలో మిర్చి దూసుకుపోతుంది. నైజాంలో విడుదలైన 11 రోజులకు 11.10 కోట్ల రూపాయిల కలెక్షన్లు సాధించి ‘మిర్చి’ సినిమా ప్రభాస్ సత్తాను చాటుతోంది. ఎలాంటి క్రేజీ కాంబినేషన్ లేని సినిమా అన్ సీజన్ లో కూడా రోజుకు కోటి రూపాయిలకు పైగా వసూలు చేయడం టాలీవుడ్ వర్గాలను విస్మయ పరుస్తోంది. వచ్చే వారం వరకూ మిర్చి కలెక్షన్లు ఇదే విధంగా ఉంటాయని వ్యాపార వర్గాలు అంచన వేస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా మిర్చి సినిమా మంచి వసూళ్ళు సాధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించిన ఈ మిర్చి సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ప్రభాస్ స్నేహితులు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి ఈ మిర్చి చిత్రాన్ని నిర్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: