గౌతమ్ మీనన్ చిక్కుల్లో పడ్డాడు. కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గౌతమ్ వాసుదేవ మీనన్... లవ్ స్టోరీలకు పెట్టిందిపేరు. కానీ, ప్రస్తుతం అతడి జీవితంలో యాక్షన్ ఎపిసోడ్ నడుస్తోంది. సూర్య హీరోగా గౌతమ్ ఓ సినిమా చేస్తానని చెప్పాడు. అదీ ఎవరితో అంటే....   ఆర్ ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ నిర్మాతలతో. ఇందుకోసం ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంస్థకు చెందిన మదన్ కూడా చేతులు కలిపాడు. వీళ్లిద్దరికీ ఆర్ ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ రూ.4.5 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చింది.  కానీ, మీనన్, మదన్, ఆర్ ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ ల మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో, సూర్య సినిమా కాస్త ఆగిపోయింది. మరి, ఆ నాలుగున్నర కోట్ల సంగతి? అందుకే, తాము ఇచ్చిన ఆ నాలుగున్నరకోట్లను వెనక్కి ఇచ్చేయమని అడిగారు ఆర్ ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ వాళ్లు. గౌతమ్ స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశారు. దాంతో తమిళనాడు హైకోర్టు గౌతమ్ కి లీగల్ నోటీసు పంపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: