శంకర్... దక్షిణాదిలో అగ్రశ్రేణి దర్శకుడు. తను ఎలాంటి చిత్రం తీసినా కమర్షియల్ వేల్యూస్ ని మాత్రం విడిచిపెట్టడు. అన్నివర్గాల వారినీ ఆకట్టుకునే మసాలా అంతా తన సినిమాల్లో దట్టించడంలో శంకర్ సిద్ధహస్తుడు. అలాగే, ఇప్పుడు విక్రమ్ తో ఐ సినిమా తీస్తున్నాడు. ఇందులో ఓ పాటను శ్మశానంలో చిత్రీకరిస్తున్నాడు. ఏదైనా శాడ్ సాంగేమో అనుకుంటే పుర్రెమీద కాలేసినట్టే. శంకర్ తీస్తున్నాడు శాడ్ సాంగ్ కాదు... రొమాంటిక్ డ్యుయెట్. మరి, రొమాంటిక్ సాంగ్ కి రుద్రభూమికి ఎందుకు వెళ్లాడూ అంటారా... అదే శంకర్ గొప్పతనం. ముల్లును ముల్లులా చూపించడానికి మామూలు ఫొటోగ్రాఫర్ చాలు. అదే ముల్లును అందంగా వెరైటీగా చూపించేవాడే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. అలాగే, శ్మశానాన్ని శ్మశానంలా చూపిస్తే శంకర్ ఎందుకవుతాడు. ఇందులో ఓ ప్రేమజంట తన్మయత్వంతో పాడుకునే పాట తీస్తున్నాడు శంకర్. శ్మశానం అంటే... అంతా లయమయ్యే చోటు. ప్రతి మనిషీ చివరికి చేరుకునే చోటు. అంటే... ఈ ప్రపంచం ఎలా పోయినా... తమ ప్రేమ మాత్రం పోదు అని ఆ జంటతో చెప్పించడానికే ఈ శ్మశానం ఎఫెక్ట్ ఇచ్చాడట శంకర్. వారెవ్వా... వాటె యాన్ ఐడియా శంకర్ జీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: