ఈసారి వేస‌వి సంగ్రామం మంచి ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతోంది. పెద్ద సినిమాల‌న్నీ ఒకేసారి గుంపుగా రాబోతున్నాయి. ఏప్రిల్ హంగామా బాద్‌షాతో మొద‌లు కానుంది. ఆ త‌ర‌వాత షాడో రాబోతోంది. ఇప్ప‌టి వ‌రకూ షాడో డేట్ అధికారికంగా ప్ర‌క‌టింలేదు. కానీ ఏప్రెల్ 11న రావ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. అదే రోజున అల్లు శిరీష్ సినిమా గౌర‌వం రావ‌డానికి కూడా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. రాధామోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. అల్లు వారి పిల్ల‌గాడు కాబ‌ట్టి... ఈ సినిమాపై ప‌రిశ్ర‌మ‌తో పాటు ప్రేక్ష‌కుల దృష్టి ప్ర‌త్యేకంగా ప‌డ‌నుంది. సగం థియేట‌ర్లు ఎలాగూ అల్లు అర‌వింద్ చేతిలో ఉన్నాయి కాబ‌ట్టి... ఈ సినిమాకి థియేట‌ర్ల స‌మ‌స్య ఎలాగూ ఉండ‌దు. అంటే షాడోకి పోటీగా గౌర‌వం రావ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: