గుణశేఖర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను రూపొందిస్తున్న ‘రాణిరుద్రమదేవి’ చిత్రం వార్తల్లో నిలుస్తుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ కోసం అనుష్క ను ఎంచుకున్న గుణశేఖర్ సినిమాలో మిగిలిన పాత్రల కోసం కూడా ఆసక్తి కలిగించేవారినే తీసుకుంటున్నాడు. గుణా టీమ్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ రాణీరుద్రమ దేవీ సినిమాలో అనుష్క టైటిల్ పాత్ర పోషిస్తుండగా, చాళుక్య వీరభద్రుడిగా రానా నటిస్తున్నారు. అలాగే, ఈ సినిమాలో ముద్దుగుమ్మలు హంసానందని, నటాలియా కౌర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మీనాక్షి దీక్షిత్ కూడా నటిస్తుంది. శ్రీకాంత్ తో దేవరాయ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి దీక్షిత్ తాజాగా ‘బాద్ షా’ సినిమాలో ఒక పాటలో నటిస్తుంది. ఇంత మంది హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టిస్తుందని గుణశేఖర్ సన్నిహితులు చెబుతున్నారు. గుణశేఖర్ తన కెరియర్ లోనే అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓరుగల్లు కోట ను సెట్ ను సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: