మొత్తానికి అల్లు శిరీష్ సినిమా గౌర‌వం తెలుగులోనూ రాబోతోంది. నిజానికి ఈ సినిమాని త‌మిళంలో మాత్రమే విడుద‌ల చేయాల‌నేది ప్రకాష్‌రాజ్ ప్లాన్‌! ఈ సినిమా గ‌నుక‌.. తెలుగులో వ‌స్తే... మెగా ఫ్యామిలీ గౌర‌వానికి భంగం క‌లుగుతుంద‌ని ప్రకాష్‌రాజ్ భావ‌న‌. ఎందుకంటే శిరీష్ న‌ట‌న ఆ రేంజులో భ‌య‌పెట్టింది మ‌రి. ర‌షెష్ చూసి బ‌న్నీ, అర‌వింద్‌లు కూడా ఇలాగే ఫిక్సయ్యారు. కానీ శిరీష్ మాత్రం ఈ సినిమాని తెలుగులో విడుద‌ల చేయాల‌ని ప‌ట్టుప‌ట్టాడ‌ట‌. తెలుగులో సినిమా రాక‌పోతే... సినీ జ‌నాల‌కు త‌ప్పుడు సంకేతాలు అందుతాయ‌ని.. శిరీష్ భ‌యం. అందుకే.. రీషూట్‌ల మీద రీషూట్‌లు చేసి మొత్తానికి సినిమా పూర్తిచేశార‌ట‌. అవుట్ పుట్‌పై నిర్మాత ప్రకాష్‌రాజ్ కూడా ఆందోళ‌న‌గా ఉన్నారు. ఈ సినిమాని తెలుగులో విడుద‌ల చేసే బాధ్యత అల్లు అర‌వింద్ స్వీక‌రించిన త‌ర‌వాతే.. ప్రకాష్‌రాజ్ మెత్తప‌డ్డాడ‌ట‌. అల్లు అర్జున్‌ని చూసిన క‌ళ్లతో శిరీష్‌ని చూస్తే మాత్రం... శిరీష్ తేలిపోతాడు. ఈ గండం నుంచి శిరీష్ ఎలా గ‌ట్టెక్కుతాడో తెలియాలంటే ఈనెల 19 వ‌ర‌కూ ఎదురు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: