టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి హీరో నితిన్ పైనే ఉంది. రెండు వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. ‘ఇష్క్’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా 30 కోట్ల రూపాయిలకు పైగా వసూలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాగా, ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ నిత్యామీనన్ కావడం విశేషం. ఇప్పుడు నితిన్ కొత్త సినిమాలో కూడా నిత్యామీనన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నితిన్ ప్రస్తుతం ‘కొరియర్ బ్యాయ్ కళ్యాణ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యామీ గౌతమ్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అయితే తాజాగా ఆమెను తొలగించి నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యామీ గౌతమ్ నటించిన ‘గౌరవం’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  ఈ కారణంతో పాటు నిత్యామీనన్ -నితిన్ జోడీగా నటించిన సినిమాలు హిట్ కావడంతో కొత్త సినిమాలోనూ నితిన్ కు జోడీగా నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: