మొన్న ప్రియమణి, నిన్న... శృతిహాసన్, నేడు తాప్సి. ఈ పంజాబీ పడుచుకీ క్రికెట్ ఫీవర్ పట్టేసుకొంది. టీ 20 మజాలో తేలిఆడుతోంది. ఇది వరకు క్రికెట్ గురించి పట్టించుకోని తాప్సి... ఇటీవల చెన్నయ్లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ని తిలకించింది.
ఈ కొత్త అలవాటు ఏమిటి? అని అడిగితే... ``క్రికెట్ అంటే ప్రత్యేక అభిమానం ఏమీ లేదు. వేల మంది ప్రేక్షకుల మధ్య మ్యాచ్ తిలకిస్తే ఎలా ఉంటుందో తెలుసుకొందామని వచ్చా. ఈ ఈలలూ, కేరింతలూ చూస్తుంటే చాలా జోష్ వస్తోంది..`` అంటోంది. మాటల ముచ్చటలో పడి... తాను బ్రెట్లీకి వీర ఫ్యాన్ అనే నిజం కక్కేసింది.
కేవలం బ్రెట్లీని చూడ్డానికే... చెన్నై, కలకొత్తా మ్యాచ్ని చూడ్డానికి వెళ్లిందట. ``చిన్నప్పుడు ఎన్నో కలలు. అందులో బ్రెట్లీ కూడా వచ్చేవాడు. ఇంత దగ్గర నుంచి చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు..`` అని పొంగిపోతోంది.