శ్రీనువైట్ల... ఈ పేరు చెబితే బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సినిమాలు గురోస్తాయి. నిజానికి జంద్యాల తరువాత ఆ స్ధాయిలో కేవలం కామెడీతో బంపర్ హిట్ కొట్టొచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు శ్రీనువైట్ల. అయితే అదంత నిన్నటిదాకా. ఇపుడు శ్రీనువైట్ల ఒంటరి పోరాటం చేస్తున్నాడట. ఎందుకంటే గతంలో తన సినిమాలకు గోపిమోహన్, కోనవెంకట్ కధ రాసేవారు, డైలాగ్స్ రాసేవారు.
కానీ బాద్ షా రిలీజ్ టైంలో కోనవెంకట్ విడిపోవడమే కాకుండా శ్రీనువైట్లకు ఏమీ రాదని రభస రభస చేశాడు. దీంతో ఆగడు స్క్రిప్ట్ తనే రాసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైయిందట శ్రీనువైట్లకు. అప్పుడెప్పుడో కెరీర్ మొదట్లో నీకోసం, ఆనందం సినిమాలకు తనే కధ రాసుకున్నాడు. కానీ గోపిమోహన్, కోన వెంకట్ వచ్చాక కధపై పట్టు పూర్తిగా పోయిందట. దీంతో జూన్ లో షూటింగ్ ప్రారంభోత్సవంజరుపుకోవాల్సిన ఆగడు స్క్రీప్ట్ మద్యలోనే ఆగిందట.
మరి ప్రిన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆగడు స్క్రీప్ట్ వర్క్ ఆగకుండా వుండాలంటే .....కోనవెంకట్ కరుణిస్తేనే సాద్యం అని కొందరు అంటున్న మాటను వింటాడా..?లేక శ్రీనువైట్లనే దూకుడుగా కధ రాసి సెట్స్ పైకి తెస్తాడో జస్ట్ వెయిట్ అండ్ సీ...