బాద్షా మూవీతో ర‌చ‌యిత‌కు,ద‌ర్శకుడి మ‌ధ్య త‌లెత్తిన వివాదం టాలీవుడ్‌లో ఓ పెద్ద దుమారాన్నేలేపింది. ర‌చ‌యిత‌ల క‌ష్టాన్ని ద‌ర్శకులు దొచేసుకుంటున్నారు అంటూ రైట‌ర్స్‌కు,డైరెక్టర్స్‌కు మ‌ధ్య డివైడ‌ర్ ఏర్పడింది.

ఎల‌క్ట్రానిక్ మీడియాలో త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ ఏక‌ర‌వు పెట్టిన కోన‌వెంక‌ట్, శ్రీను వైట్లతో తెగ‌దెంపులు చేసుకొని మెగాఫోన్ ప‌ట్టుకోవ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. టాలీవుడ్‌లో ర‌చ‌యిత‌లు ద‌ర్శకులుగా మారి బ్లాక్ బ‌స్టర్ ఫిల్మ్‌లు అందిస్తుంటే వీరి వ‌రుస‌లోనే కోన‌వెంక‌ట్ కూడ జాయిన్ అయ్యాడు.
��
advertisements - Call 040 4260 1008



ప్రస్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు స్టోరీ చెప్పె ప‌నిలో ఉన్నాడు. కోన‌వెంక‌ట్ చెప్పిన స్టోరి లైన్‌ను ప‌వ‌న్ దాదాపుగా ఓకే చేసాడ‌ని కోన‌వెంక‌ట్ స‌న్నిహితులు అంటున్న మాట‌. అస‌లు కోన‌వెంక‌ట్ ఎవ‌రితో మూవీ డైరెక్ట్ చేయ‌బోతున్నాడో అనేది ఇంకా అఫిషియ‌ల్‌గా బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. అప్పటి వ‌ర‌కూ ఈ మూగ‌బోయిన గొంతు ఎప్పుడు మాట్లాడుతుందా అనేదానిపై టాలీవుడ్ ఎదురుచూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: