ఊహించిన‌దే జ‌రిగింది. షారుక్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో అతిథిగా క‌నిపించడానికి మ‌హేష్‌బాబు ఒప్పుకోలేదు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో మ‌హేష్ బాబు అతిథి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. షారుక్ సినిమాక‌దా..

మ‌హేష్ నో చెప్ప‌డు.. అనుకొన్నారు. అయితే చిత్ర‌బృందం ఎంత ప్ర‌య‌త్నించినా మ‌హేష్ నుంచి సానుకూల స్పంద‌న రాలేదు. మ‌హేష్ పేరు చెప్పుకొని ఈ సినిమాని తెలుగులో భారీ రేట్ల‌కు అమ్ముకొందామ‌నుకొన్న

నిర్మాత వ్యూహాలు ఫ‌లించ‌లేదు. అతిథి పాత్ర‌లు చేయ‌డానికి సిద్దంగా లేను, అంత తీరిక లేదు... అని మ‌హేష్ చెప్పేశాడ‌ట‌. దాంతో ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ మ‌రి కొంత కాలం వాయిదా ప‌డింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: