ఎవర్ని నొప్పించకుండా చాల వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో నాగార్జునను మించినవారు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేరు. అయితే నాగార్జున లేటెస్ట్ గా చేసిన ట్విట్ కొద్దిగా వెటకారంతో ఉండటమే కాకుండా అది ఏకంగా దిల్ రాజ్ ను టార్గెట్ చేసే విధంగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగచైతన్య మల్టీస్టారర్ తీయబోతున్నట్టు మీడియాకి దిల్ రాజు న్యూస్ లీక్ చేసాడు. సాధారణంగా అంత పెద్ద నిర్మాత ఈ తరహా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఏ హీరో అయినా క్యూరియాసిటీ కొద్దీ కథేంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ నాగార్జున మాత్రం తన ట్విట్టర్ లోకి వచ్చి 'ఇది నాకు కూడా న్యూసే' అంటూ వెటకారంగా ట్వీట్ చేసాడు.
ఇప్పుడు ఈ వ్యవహారమే టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దిల్ రాజుని నాగార్జున డిజప్పాయింట్ చేయడం ఇది మొదటిసారి కాదు. రవితేజతో చేద్దామనుకున్న కథ నాగార్జునకి సూట్ అవుతుందని దిల్ రాజు నాగ్ చుట్టూ తిరిగాడు. అయితే కనీసం ఆ కథ వినడానికి కూడ నాగార్జున ఆసక్తి కనపరచలేదు అన్న వార్తలు ఉన్నాయి.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ దగ్గర నుంచి నాగ్తో సినిమా తీయాలని దిల్ రాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నాగ్ మాత్రం అతడిని ఎందుకో దూరం పెడుతున్నాడు అని ఫిలింనగర్ టాక్. దీనికితోడు లేటెస్ట్ గా ఈ మల్టీ స్టారర్ కథ వినే ఆసక్తి కూడా చూపించకుండా పబ్లిగ్గానే దిల్ రాజుని నాగ్ ఇన్సల్ట్ చేసాడు అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
దీనితో దిల్ రాజ్ ను నాగార్జున ఎందుకు దూరం పెడుతున్నాడు అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నాగచైతన్యని 'జోష్' చిత్రంతో ఇంట్రడ్యూస్ చేసే అవకాశాన్ని అందరినీ వదిలేసి దిల్ రాజుకి నాగార్జున ఇస్తే అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు అన్న భావం నాగార్జున మనసులో ఉంది అని అంటారు. ఆ చిత్రం మిస్ ఫైర్ అవడంతో ఆరంభమే ట్రాక్ తప్పి చైతన్య ఇంతవరకు స్టార్గా ఎదగలేక పోయాడు అన్న భావనతో నాగార్జున ఇంకా దిల్ రాజ్ పై ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు అన్న వార్తలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు నాగార్జున ట్విట్ ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది..